NTV Telugu Site icon

KTR: కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు సోమవారానికి వాయిదా..

Ktr

Ktr

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కావలసిన మంత్రి కొండ సురేఖపైన వేసిన కేసు సోమవారాకి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరు కావడం లేదని విశ్వనీయ సమాచారం. అయితే తాజాగా గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ కేటీఆర్ ఈ నెల 3న నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్‌ను ఈ నెల 14న విచారించిన కోర్టు విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలను శుక్రవారం(18)న నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో నేడు బీఆర్‌ఎస్‌ నేతలు కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా ఈ కేసును మేజిస్ట్రేట్ శ్రీదేవి సోమవారం వాయిదా వేసినట్లు సమాచారం.
KTR Tweet: మూసీ మురుగులో పొర్లుతూ అంద‌రికీ బుర‌ద‌ను అంటించాల‌ని.. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్