Trains Cancelled: దానా ఎఫెక్ట్.. మరో 17 రైళ్లు రద్దు .. సమాచారం కోసం హెల్ప్లైన్ నంబర్లు..
- 'దానా' తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేసింది ..
- మంగళవారం 41 రైళ్లను రద్దు చేయగా- తాజాగా మరో 17 రైళ్లను రద్దు చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశా తీరప్రాంతంలో ‘దానా’ తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేసింది. మంగళవారం 41 రైళ్లను రద్దు చేయగా, తాజాగా మరో 17 రైళ్లను రద్దు చేశారు. గురువారం నుంచి ఈ నెల 29 వరకు కొత్తగా రద్దయిన రైళ్లను నిలిపివేస్తున్నట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. రద్దు చేయబడిన రైళ్ల సమాచారం కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 17 ముఖ్యమైన స్టేషన్లలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, సికింద్రాబాద్, ఖాజీపేట, ఖమ్మం, సామర్లకోట, వరంగల్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లి, ఏలూరు, గూడూరు, నిడదవోలు, ఒంగోలు, తిరుపతి, రేణిగుంట, డోన్ స్టేషన్లలోని హెల్ప్లైన్ కేంద్రాలు ప్రయాణికులకు 24 గంటలూ అవసరమైన సమాచారాన్ని అందజేస్తాయని పేర్కొంది. ఈ తుపాను నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య కేంద్రాల్లో రైళ్ల రాకపోకల సమాచారం కోసం 17 నగరాలు/పట్టణాల్లో హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు దాదాపు 200 రైళ్ల సర్వీసులను రద్దు, దారిమళ్లించినట్లు సమాచారం.

Also Read
- CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
- Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
- Tragedy: వీడు మనిషి కాదు మానవ మృగం.. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో.. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురి హత్య..
- MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
Read also: Custard Apple: సీతాఫలం పండ్లు తింటే శరీరానికి ఎంత మేలు తెలుస్తుందో తెలుసా?
మరోవైపు ఈ తుపానుతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా 23 నుంచి 25వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను ఇప్పటికే రద్దు చేశారు. ఈ నెల 27న జరగాల్సిన ఒడిశా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష కూడా వాయిదా పడింది. కొత్త తేదీని తర్వాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల 24, 25 తేదీల్లో నందన్కనన్ జూ, బొటానికల్ గార్డెన్స్కు సందర్శకులను అనుమతించబోమని నిర్ణయించారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్, బితార్కానికా నేషనల్ పార్క్లను ఈ నెల 25 వరకు మూసివేయనున్నారు. తుపాను సమయంలో మూగజీవాలకు ఆశ్రయం కల్పించాలని మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి గోకులానంద మల్లిక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జంతువులు గాయపడినట్లు గుర్తిస్తే 1962 హెల్ప్లైన్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
Lenin Day 1 Collections : అయ్యగారు అదిరిపోయే స్టార్ట్.. లెనిన్ డే-1 ఎంతంటే?
-
LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!