Osmania University: డీఎస్సీ వాయిదా వేయండి.. అర్ధరాత్రి అభ్యర్థుల ఆందోళన..
- డీఎస్సీ ని వాయిదా వెయ్యాలని ఉస్మానియా వేదికగా ఆందోళన..
- సిటీ కాలేజీ గ్రౌండ్ లో అరెస్టు చేసిన అభ్యర్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Osmania University: డీఎస్సీని వాయిదా వేయాలని ఉస్మానియా వేదికగా డీఎస్సీ అభ్యర్థులు అర్ధరాత్రి ఆందోళన నిర్వహించారు. నిన్న ప్రభుత్వం తమ సమస్యలను నెరవేర్చాలంటూ ఆందోళన చేసిన డీఎస్సీ అభ్యర్థులను అరెస్టు చేసి సిటీ కాలేజీ గ్రౌండ్ లో ఉంచారు. రాత్రి సిటీ కాలేజ్ నుండి ఉస్మానియా క్యాంపస్ వరకు అర్థరాత్రి డీఎస్సీ అభ్యర్థులు ర్యాలీగా ఉస్మానియా యూనివర్శిటీకి చేరుకొని ఆందోళన చేపట్టారు. రాత్రి అవుతున్నా మహిళలు అని చూడకుండా.. లైట్లు లేకపోయినా అక్కడే ఉంచారు. కనీసం తాగడానికి నీళ్ళు లేక లైట్లు ఆపేయడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read also: Rahul Gandhi: ఈ రోజు రాయ్బరేలీలో రాహుల్గాంధీ పర్యటన.. కార్యకర్తలతో భేటీ..!
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
వీరి ఆందోళన పట్టించుకోని విద్యాశాఖ ప్రకటించిన విధంగా జులై 11 నుండి హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తామని వెల్లడించింది. యదావిధిగా జులై 18 నుండి డి.ఏస్.సి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించింది. దీంతో మా ఆందోళనను అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే డీఎస్సీని 3 నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నారు. గతంలో టెట్ ఎక్జామ్ వ్రాసి అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పటికే ఆలస్యమైందన్నారు. కావున వెంటనే డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని వారు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మద్య టెట్ లో అర్హత సాధించిన వారే వాయిదా కావాలంటున్నారు. వీరి ఆందోళనకు విద్యార్థి నాయకులెవరు మద్దతు ఇవ్వకపోవడం గమనార్హం.
Read also: Nag Ashwin-Kalki 2898 AD: బిగ్గెస్ట్ ఐమాక్స్లో ‘కల్కి’ చూడనున్న నాగ్ అశ్విన్!
కానీ ప్రభుత్వం మాత్రం వందల సంఖ్యలోనే ఉద్యోగాలు ఇస్తూ వారిని నిరాశకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఇక మరోవైపు తెలంగాణలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం నో చెబుతోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. డీఎస్సీ పరీక్షలు జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు యథావిధిగా జరుగుతాయని వెల్లడించింది. అభ్యర్థులు సాయంత్రం 5 గంటల నుంచి వెబ్సైట్లో డీఎస్సీ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
India-France: చైనాకు చెక్.. భారత్- ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ సముద్ర యుద్ధ విమానాలు కొనుగోలు..
తాజావార్తలు
-
Sunny Leone: అడ్డంగా బుక్కైన సన్నీలియోన్.. రంగంలోకి దిగిన సీఐడీ! అసలేం జరిగిందంటే..
-
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!