CM Revanth Reddy: మెగాస్టార్ చిరంజీవి సందేశం.. వీడియో విడుదల చేసిన సీఎం రేవంత్..
- సినిమా ఇండస్ట్రీ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు..
- మాదకద్రవ్యాలపై మెగాస్టార్ చిరంజీవి ఉచితంగా నటించి వీడియోను విడుదల..
- చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: సినిమా ఇండస్ట్రీ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. మాదకద్రవ్యాలపై మెగాస్టార్ చిరంజీవి ఉచితంగా నటించి వీడియోను విడుదల చేశారు. చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన నటీనటులందరూ కూడా ఆయన బాటలో నడవాలని సూచించారు. మదకద్రవ్యాల నియంత్రణకు సినిమా ఇండస్ట్రీ కూడా కృషి చేయాలన్నారు. సినిమా రిలీజ్ ల సమయంలో టికెట్ల ధరలపై కాకుండా.. ఆ సినిమాలో నటించే నటీనటుల ద్వారా మాదకద్రవ్యాలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండేలా ఒక ప్రోమో క్రియేట్ చేసి వాటిని థియేటర్లో టెలికాస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. టికెట్లను పెంచి వ్యాపారం చేసుకోవడం ఎలా వ్యాపారం చేస్తున్నారో, సమాజాకి బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.
Read also: Revanth Reddy: డ్రగ్స్ పై యుద్ధం.. సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కండిషన్స్ ?
Also Read
రాష్ట్రంలో ఉన్న అన్ని థియేటర్ల యాజమాన్యం తప్పకుండా సినిమా ప్రారంభానికి ముందు సైబర్ క్రైమ్, డ్రగ్స్ వాడకం పై అవగాహన కల్పించే రీల్స్ ని ఉచితంగా ప్రదర్శించాలని కోరారు. అలాంటి థియేటర్ల వారికే ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్ర క్రీడాకారులు కూడా ఇలాంటి వాటిపై అవగాహన కల్పించే విధంగా ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. మాదక ద్రవ్యాల కట్టడిలో భాగంగా ఏర్పాటు చేసిన వాల్ బోర్డు పై మార్పు మన ప్రభుత్వ బాధ్యత అని రేవంత్ రెడ్డి రాశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐపీసీలో తీసుకొచ్చిన మార్పులను స్వాగతిస్తున్నామన్నారు. ఈరోజు గల్లీ గల్లీలలో గంజాయి దొరికే పరిస్థితిలో వచ్చాయని తెలిపారు. వీటిని నియంత్రించడానికి అధికారులకు సంపూర్ణ అధికారం ఇచ్చామన్నారు. అవసరమైన సిబ్బందిని కూడా కేటాయించామని తెలిపారు. అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పేద, మధ్యతరగతి పిల్లలు గంజాయికి బానిసలుగా మారి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
Read also: Revanth Reddy: డ్రగ్స్ పై యుద్ధం.. సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కండిషన్స్ ?
చిన్న పిల్లలపై జరుగుతున్న దాడుల వెనక గంజాయి మత్తులోనే జరుగుతున్నట్లుగా అర్థమవుతుందని సీఎం అన్నారు. ఈ నేరాలు నియంత్రించి, తెలంగాణ సమాజంలో యువతలో పోరాట స్పూర్తి తిరిగి నింపే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మాదకద్రవ్యాల కేసులను సమర్థవంతంగా నియంత్రించాలన్నారు. మాదాక ద్రవ్యాల నియంత్రించడంలో కీలక పాత్ర పోషించే అధికారులకు ప్రమోషన్స్ తో పాటు సైబర్ క్రైమ్ లో నైపుణ్య ప్రదర్శించి, నేరగాళ్ళను పట్టుకున్న వారికి ఇతర మదకద్రవ్యాల రాకెట్లను పట్టుకున్న అలాంటి అధికారులకు నగదు బహుమతితోపాటు పదోన్నతి కూడా కల్పించడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలంటూ డీజీపికి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాలు, సైబర్ క్రైమ్ కీటకాలు అడుగు పెట్టాలంటే భయపడాలన్నారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటే బాధితులతో ఫ్రెండ్లీగా ఉండాలి కానీ నేరాలతో ఫ్రెండ్లీగా కాదన్నారు. అలా వ్యవహరిస్తే సమాజంలో డిపార్ట్మెంట్ పై నమ్మకం సన్నగిల్లుతుందని సీఎం రేవంత్ తెలిపారు.
Hairfall : మీ జుట్టు బాగా రాలుతుందా.. అయితే ఈ ఐదు రకాల ఆహారాలు తీసుకోండి
తాజావార్తలు
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!