CM Revanth Reddy: విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. చారిత్రక కట్టడాలు ఉచితంగా సందర్శించే అవకాశం..
- సీఎం రేవంత్ సర్కార్ తాజాగా కొత్త నిర్ణయం తీసుకుంది..
- రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు..
- తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పర్యాటక- చారిత్రక కట్టడాలను ఉచితంగా సందర్శించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: సీఎం రేవంత్ సర్కార్ తాజాగా కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలను ఉచితంగా సందర్శించే అవకాశం విద్యార్థులకు కల్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం ‘తెలంగాణ దర్శిని’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు వివరించారు. తెలంగాణ దర్శి కార్యక్రమంలో భాగంగా 2 నుంచి 4వ తరగతి విద్యార్థులను పర్యాటక ప్రాంతాలకు రోజు విహారయాత్రలకు తీసుకెళ్తారు. వారసత్వ ప్రదేశాలు, ఉద్యానవనాలు, స్మారక చిహ్నాలను చూపుతూ చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను వివరిస్తారు. 5 నుంచి 8వ తరగతి విద్యార్థులకు 20-30 కిలోమీటర్ల పరిధిలో రోజు పర్యటనలు ఉంటాయి.
ఈ యాత్రల్లో విద్యార్థులు ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శిస్తూ తెలంగాణ ప్రత్యేకతలను తెలుసుకుంటారు. 9వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండు రోజుల పాటు 50-70 కి.మీ పరిధితో లాంగ్ ట్రిప్పులు నిర్వహిస్తారు. ఇది స్థానిక చరిత్ర, సంస్కృతి, శిల్ప సంపదను తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. యూనివర్సిటీ విద్యార్థులు తమ సొంత జిల్లాలకు మించి సుదూర ప్రాంతాలకు నాలుగు రోజుల పర్యటనలకు వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించడం ద్వారా విద్యార్థులు కేవలం పుస్తకాల్లోని పాఠాలకే పరిమితం కాకుండా చరిత్రను తెలుసుకునే అవకాశం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సచివాలయంలో తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి టీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఉస్మానియా యూనివర్శిటీలోని మహాలఖ స్టెప్ వెల్ పునరుద్ధరణ కాంట్రాక్టును ఇన్ఫోసిస్ కంపెనీ అప్పగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పురాతన కట్టడాలను పరిరక్షించే లక్ష్యంతో రాష్ట్ర పర్యాటక శాఖ ఇటీవల సీఐఐతో ఒప్పందం కుదుర్చుకుంది.
Naini Rajender Reddy: వాడు వీడు అనడం మంచి పద్దతి కాదు.. కేటీఆర్ పై నాయిని ఫైర్
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!