CM Revanth Reddy: విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. చారిత్రక కట్టడాలు ఉచితంగా సందర్శించే అవకాశం..
- సీఎం రేవంత్ సర్కార్ తాజాగా కొత్త నిర్ణయం తీసుకుంది..
- రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు..
- తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పర్యాటక- చారిత్రక కట్టడాలను ఉచితంగా సందర్శించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: సీఎం రేవంత్ సర్కార్ తాజాగా కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలను ఉచితంగా సందర్శించే అవకాశం విద్యార్థులకు కల్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం ‘తెలంగాణ దర్శిని’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు వివరించారు. తెలంగాణ దర్శి కార్యక్రమంలో భాగంగా 2 నుంచి 4వ తరగతి విద్యార్థులను పర్యాటక ప్రాంతాలకు రోజు విహారయాత్రలకు తీసుకెళ్తారు. వారసత్వ ప్రదేశాలు, ఉద్యానవనాలు, స్మారక చిహ్నాలను చూపుతూ చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను వివరిస్తారు. 5 నుంచి 8వ తరగతి విద్యార్థులకు 20-30 కిలోమీటర్ల పరిధిలో రోజు పర్యటనలు ఉంటాయి.
ఈ యాత్రల్లో విద్యార్థులు ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శిస్తూ తెలంగాణ ప్రత్యేకతలను తెలుసుకుంటారు. 9వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండు రోజుల పాటు 50-70 కి.మీ పరిధితో లాంగ్ ట్రిప్పులు నిర్వహిస్తారు. ఇది స్థానిక చరిత్ర, సంస్కృతి, శిల్ప సంపదను తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. యూనివర్సిటీ విద్యార్థులు తమ సొంత జిల్లాలకు మించి సుదూర ప్రాంతాలకు నాలుగు రోజుల పర్యటనలకు వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించడం ద్వారా విద్యార్థులు కేవలం పుస్తకాల్లోని పాఠాలకే పరిమితం కాకుండా చరిత్రను తెలుసుకునే అవకాశం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సచివాలయంలో తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి టీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఉస్మానియా యూనివర్శిటీలోని మహాలఖ స్టెప్ వెల్ పునరుద్ధరణ కాంట్రాక్టును ఇన్ఫోసిస్ కంపెనీ అప్పగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పురాతన కట్టడాలను పరిరక్షించే లక్ష్యంతో రాష్ట్ర పర్యాటక శాఖ ఇటీవల సీఐఐతో ఒప్పందం కుదుర్చుకుంది.
Naini Rajender Reddy: వాడు వీడు అనడం మంచి పద్దతి కాదు.. కేటీఆర్ పై నాయిని ఫైర్
Also Read
- Rythu Bharosa : రైతులకు పెట్టుబడి సాయం.. మరో రూ.1,009 కోట్లు విడుదల
- AI Training : మైనారిటీ విద్యార్థులకు ‘ఏఐ’ శిక్షణ.. తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం
- Hyderabad: స్విట్జర్లాండ్కు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతులు.. రూ.50 కోట్ల మోసం ఆరోపణలతో కొత్త ట్విస్ట్.!
- Drugs Busted: అత్తాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. MDMAతో పాటు భారీగా ఇంజెక్షన్లు స్వాధీనం.!
తాజావార్తలు
-
China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్ను దించిన చైనా!
-
Ind Vs Eng: ప్రతీ మ్యాచ్లో కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు.. టీమిండియా సభ్యుల నుంచి ఇలా..
-
Termite Prevention: వర్షాకాలం ఇంట్లో చెదలు పెరుగుతుందా.? అయితే ఇలా చెక్ పెట్టండి..
-
Lenin: లెనిన్ హిట్ టాక్.. నాగ్’ను పట్టుకుని ఏడ్చేసిన అఖిల్
-
IND vs ENG 5th T20: ‘వైట్వాష్’ ముప్పు.. దిక్కుతోచని స్థితిలో భారత్.. తొలి విజయం కోసం ఎదురుచూపులు!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!