Bhatti Vikramarka: నేడు బట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం..
- డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం..
- సెక్రెటిరేటర్ లో ఉదయం 11.30గంటలకు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం..
- సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సబ్ కమిటి నివేదిక కొలిక్కి తెచ్చే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: నేడు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సెక్రెటిరేటర్ లో ఉదయం 11.30గంటలకు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. రైతు భరోసాపై చర్చించనున్నారు. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సబ్ కమిటి నివేదిక కొలిక్కి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read also: Constables Suicide: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల ఆత్మహత్య..
Also Read
వచ్చే ఏడాది సంక్రాంతికి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. దీంతో రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి సారిస్తుంది. అర్హులైన రైతులను గుర్తించేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అనర్హులను తొలగించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు వర్గాలతో చర్చలు జరిపింది. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద పంటలు పండించని భూ యజమానులకు రూ.21 వేల కోట్లకు పైగా ఇచ్చారనీ, కానీ ఇప్పుడు నిజంగా సాగుచేసే నిజమైన రైతులందరికీ రైతు భరోసా పథకం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కొండలు, గుట్టలు, రహదారులకు కూడా పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నందున వాటిని గుర్తించేందుకు కసరత్తు చేస్తుంది.
Read also: MLC Kavitha: నేడు నిజామాబాద్కు ఎమ్మెల్సీ కవిత.. ఇందల్వాయి టోల్ గేట్ వద్ద నుంచి భారీ ర్యాలీ
భూమిలేని పేదలకు ఆర్థిక సాయం, అన్నదాతలకు రైతు భరోసా పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఒక్క ఎకరం వ్యవసాయ భూమి కూడా లేని, రోజువారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని కూడా ప్రారంభించే సర్కార్ యోచిస్తోంది. తెలంగాణలో మొత్తం 1.16 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు ఇటీవల ఇంటింటికీ తిరిగి సర్వేలో వెల్లడైంది. వీరిలో 70 లక్షల మంది రైతులు భూమి నమోదు పుస్తకాలు, రెవెన్యూ రికార్డులు కలిగి ఉన్నారు. మిగిలిన 46 లక్షల కుటుంబాలకు భూమి లేదు. వారిలో పేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ చట్టం కార్మిక గుర్తింపు కార్డును ప్రాతిపదికగా ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Hyderabad Police: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. పబ్లు, బార్లపై పోలీసుల ఫోకస్..
తాజావార్తలు
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
-
Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. ‘RX100’ తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
-
Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
-
TPCC Mahesh Goud : రాహుల్ గాంధీ అరెస్ట్కు నిరసనగా రేపు ‘ఛలో లోక్ భవన్’
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!