NTV Telugu Site icon

Bandi Sanjay: డ్రగ్స్‌ కేసు విచారణ ఏమైంది.. బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ అక్రమాలపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. ఓవైసీలకు, ఎంఐఎంకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఒవైసీ కాలేజీలో ఓ ఫ్యాకల్టీ ఉగ్రవాది ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీల ఉగ్ర లింకులపై మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కి ఇస్లాం ఫోబియో ఉందని ఓవైసీ అంటున్నారని మండిపడ్డారు. 15 నిమిషాలు టైం ఇస్తే నరికి చంపుతాం అన్నవారికి హిందూ ఫోబియో ఉందా..? అని ప్రశ్నించారు. గో మాంసం తినాలని మజా అని అన్నది ఓవైసీ అని మండిపడ్డారు.

ఓవైసీ కాలేజీలో ఒక ఫ్యాకల్టీ ఉగ్రవాది ఉన్నాడన్నారు. మదర్సాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్నారు. సెక్యులర్ జపం చేస్తున్న ఓవైసీ హిందూ పండగలు ఏ ఒక్కటీ చేసుకోడు ఎందుకు…? అని ప్రశ్నించారు. మేము మా హిందువులం సెక్యులర్స్ పీర్ల పండగ జరుపుతామన్నారు. ఓవైసీలకు, ఎంఐఎంకి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్నారు. వారి ఉగ్ర లింకుల పై మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. అమృత్ స్కీం లో అవినీతి జరిగిందని కేటీఆర్ అంటున్నాడు బీజేపీ పై ఆరోపణలు చేస్తున్నాడన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి.. ఓటుకు నోటు, కేసు ఏది.. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందన్నారు. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి లోపాయకారి అంగీకారం ఉందన్నారు. అమృత్ స్కీం అవినీతి పై ఆధారాలు ఇవ్వండి విచారణ జరిపి కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు.
Hydraa Update: కూకట్ పల్లి, అమీన్ పూర్.. హైడ్రా అప్డేట్ ..