AP CM Chandrababu: హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబు ర్యాలీ.. పోలీసులు ఏమన్నారంటే..
- హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబు ర్యాలీ..
- వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి..
- నిర్ణీత గడువులోగా ర్యాలీని ముగించాలని పోలీనులు సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Chandrababu: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు ఒకే వేదికపైకి రాబోతోన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేవంత్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. చర్చలకు రావాలని ఆహ్వానించారు. విభజన సమస్యల పరిష్కారం దిశగా చంద్రబాబు తొలి అడుగు వేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో ముఖాముఖి భేటీకి ప్రతిపాదన పై ఇటీవల ఆయనకు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీని (శనివారం) సమావేశం నిర్వహించాలని సూచించారు. ఇందులో పాల్గొనేందుకు మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆయన సమావేశం కానున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు ఆ హోదాలో హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి. దీంతో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వాగత ర్యాలీ నిర్వహించనున్నారు.
Also Read
- Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
- Telugu Film Industry : తెలుగు సినిమాకు తెలంగాణ సర్కార్ బిగ్ బూస్ట్.. కొత్త జీవోతో గేమ్చేంజ్.!
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు స్వాగత ర్యాలీ కొనసాగనుంది.దీనికి హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. ర్యాలీ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి పీ అండ్ టీ జంక్షన్- బేగంపేట ఫ్లైఓవర్- ప్రజాభవన్- పంజాగుట్ట ఫ్లైఓవర్- ముఖరంజా మీదుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు చేరుకుంటుంది. కొద్ది నిమిషాల పాటు చంద్రబాబు అక్కడ ఆగనున్నారు. తెలంగాణ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం స్వాగత ర్యాలీ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65కి చేరుకుంటుంది.ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి అజ్మీరారాజు నాయక్ దాఖలు చేసిన దరఖాస్తుకు హైదరాబాద్ పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ర్యాలీలో డ్రోన్లు, ఫ్లయింగ్ కెమెరాలు ఉపయోగించరాదని పోలీసులు స్పష్టం చేశారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ర్యాలీని ముగించాలని సూచించారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Tata Cars Price Hike: టాటా కార్లు కొనేవారికి ఇదే చివరి ఛాన్స్..! పెరగనున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ కార్ల ధరలు
-
Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
-
Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
-
Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!