AP CM Chandrababu: హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబు ర్యాలీ.. పోలీసులు ఏమన్నారంటే..
- హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబు ర్యాలీ..
- వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి..
- నిర్ణీత గడువులోగా ర్యాలీని ముగించాలని పోలీనులు సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Chandrababu: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు ఒకే వేదికపైకి రాబోతోన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేవంత్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. చర్చలకు రావాలని ఆహ్వానించారు. విభజన సమస్యల పరిష్కారం దిశగా చంద్రబాబు తొలి అడుగు వేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో ముఖాముఖి భేటీకి ప్రతిపాదన పై ఇటీవల ఆయనకు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీని (శనివారం) సమావేశం నిర్వహించాలని సూచించారు. ఇందులో పాల్గొనేందుకు మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆయన సమావేశం కానున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు ఆ హోదాలో హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి. దీంతో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వాగత ర్యాలీ నిర్వహించనున్నారు.
Also Read
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు స్వాగత ర్యాలీ కొనసాగనుంది.దీనికి హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. ర్యాలీ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి పీ అండ్ టీ జంక్షన్- బేగంపేట ఫ్లైఓవర్- ప్రజాభవన్- పంజాగుట్ట ఫ్లైఓవర్- ముఖరంజా మీదుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు చేరుకుంటుంది. కొద్ది నిమిషాల పాటు చంద్రబాబు అక్కడ ఆగనున్నారు. తెలంగాణ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం స్వాగత ర్యాలీ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65కి చేరుకుంటుంది.ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి అజ్మీరారాజు నాయక్ దాఖలు చేసిన దరఖాస్తుకు హైదరాబాద్ పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ర్యాలీలో డ్రోన్లు, ఫ్లయింగ్ కెమెరాలు ఉపయోగించరాదని పోలీసులు స్పష్టం చేశారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ర్యాలీని ముగించాలని సూచించారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?