Shavarma: షవర్మా తిని 17 మందికి తీవ్ర అస్వస్థత.. అల్వాల్ గ్రిల్ హౌజ్ బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shavarma: హైదరాబాద్లోని అల్వాల్లో షవర్మా తిని 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట నలుగురు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు, ఐదు రోజుల్లో బాధితుల సంఖ్య 17 కి చేరుకుంది. బొల్లార్కు చెందిన భవిక్ రెడ్డి, మున్నా శనివారం మధ్యాహ్నం ఇద్దరు యువతులతో కలిసి షావర్మా తిన్నారు. ఇంటికి వెళ్లిన అరగంటకే వాంతులు, విరేచనాలు అయ్యాయి. అస్వస్థతకు గురికావడంతో బాధితులు ఒక్కొక్కరుగా ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. వారు వాంతులు, విరేచనాలు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం కంటోన్మెంట్ జనరల్ ఆస్పత్రిలో 13 మంది, ప్రవేటు ఆస్పత్రిలో నలుగురు చికిత్స పొందుతున్నారు. బాధితుల రక్త పరీక్షల్లో హానికరమైన సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారి బీ లక్ష్మీకాంత్ ధృవీకరించారు. మయోనైస్ వల్లనే తాము అస్వస్థతకు గురయ్యామని చెప్పారు. షావర్మా, కబాబ్లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లలో సాధారణంగా ఉపయోగించే మయోనైస్, మసాలాల వాడకం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయినట్లు తెలుస్తుంది.
Read also: Extra Ordinary Man OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Also Read
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనెతో తయారు చేసిన మయోనైజ్ తయారీ సమయంలో పరిశుభ్రత, ప్రమాణాలు పాటించకపోతే ప్రమాదకరమని తెలిపారు. అన్ని ప్రమాణాలు సిద్ధం చేసిన మయోన్నైస్ నాలుగు గంటల్లో వినియోగించబడాలని హెచ్చరిస్తుంది. నిల్వ ఉంచి వినియోగిస్తే రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. షావర్మాతో పాటు మయోనైస్ కూడా తీసుకోవడం వల్ల చాలా మంది ఆసుపత్రుల్లో చేరినట్లు జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. అలా జరగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం వహించే హోటల్ యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రిల్ హౌస్ మేనేజర్ తౌఫిక్ను అరెస్టు చేసినట్లు అల్వాల్ ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్ వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 273, 269 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Extra Ordinary Man OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తాజావార్తలు
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
-
Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
ట్రెండింగ్
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!