Site icon NTV Telugu

HYDRA : 8 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపిన హైడ్రా

Hydra

Hydra

హైదరాబాద్‌లోని పోచారంలో 1978లో 27 ఎకరాల భూమి మీద 400 ప్లాట్లతో ఏర్పాటు చేసిన జీపీ లే అవుట్‌లో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను హైడ్రా సిబ్బంది తొలగించారు. ఈ లే అవుట్‌లో ఒక వ్యక్తి 6.18 ఎకరాల భూమిని తనదేంటూ అక్రమంగా ప్రహరీ నిర్మించినట్టు సొసైటీ సభ్యులు వాదించారు. ఈ వ్యవహారం సుమారు 8 ఏళ్లుగా కొనసాగుతూ, సొసైటీ సభ్యులు అనేక మార్ల ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.

Kurnool Bus Fire : మెదక్ జిల్లాకు చెందిన తల్లి-కూతురు దుర్మరణం

తుదిగా సొసైటీ సభ్యులు ప్రజావాణి ద్వారా తమ ఫిర్యాదును హైడ్రా అధికారులకు తెలిపారు. ఫిర్యాదు దృష్టిలో ఉంచుకుని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి, ప్రహరీ గోడ అక్రమ నిర్మాణంగా ఉందని నిర్ధారించారు. అందువల్ల, హైడ్రా సిబ్బంది ప్రహరీ గోడను తొలగించి, స్థానికుల సమస్యకు చట్టపరమైన పరిష్కారం అందించారు. “8 ఏళ్లుగా ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నాం, ఇప్పుడు హైడ్రా తీసుకున్న చర్యల ద్వారా సమస్య పరిష్కారమైంది . ఇలాంటి సమస్యలకు ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందని ఆశిస్తున్నాం,” అని సొసైటి సభ్యులు తెలిపారు.

S-400: చైనా, పాక్‌లకు హెచ్చరిక.. S-400, S-500 ట్రైనింగ్ కోసం రష్యాకు భారత దళాలు..

Exit mobile version