Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండగా.. సాయంత్రం మబ్బులు కమ్ముకుని వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని ప్రజలు ప్రైవేట్ వాహనాల కంటే మెట్రోలో ప్రయాణించడానికి ఇష్టపడతారు. దీంతో మెట్రో స్టేషన్లలో రద్దీ పెరిగింది. మెట్రో స్టేషన్ల వద్ద జనం గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. ఇటీవల అమీర్పేట మెట్రో స్టేషన్కు ప్రయాణికులు భారీగా తరలివచ్చారు. ఈ స్టేషన్ ముంబై మెట్రో స్టేషన్లను పోలి ఉంటుంది. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. మెట్రో సర్వీసుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ముఖ్యమైన రూట్లలో షార్ట్ లూప్ ట్రిప్పులను అందుబాటులో ఉంచారు. ఈ షార్ట్ లూప్ ట్రిప్పుల వల్ల ప్రయాణికుల రద్దీ తగ్గడమే కాకుండా రైళ్ల కోసం ఎక్కువ సేపు నిరీక్షించాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అమీర్పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల నుంచి షార్ట్ లూప్ ట్రిప్పులు నడుస్తాయి. ముఖ్యంగా రాయదుర్గం వెళ్లే మెట్రో చాలా రద్దీగా ఉంటుంది. దీంతో అమీర్పేట-రాయదుర్గం కారిడార్లో ప్రతి 4.30 నిమిషాలకు ఒక రైలు నడుస్తుంది. ప్రస్తుతం ప్రతి 7 నిమిషాలకు ఒక రైలు నడుస్తుండగా.. ఆ సమయాన్ని తగ్గించారు. దీంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
కాగా, మెట్రో చార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఛార్జీలు పెంచాలని మెట్రో అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం కోచ్ల సంఖ్యను పెంచకుండా, మెట్రో స్టేషన్లలో మౌలిక వసతులు కల్పించడంలో ఎల్ఎంటీ విఫలమైందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండింటికి సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు వచ్చే వరకు టికెట్ రేట్లు పెంచేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. తాజాగా మెట్రో ప్రయాణికులకు షాక్ ఇస్తూ మెట్రో అధికారులు స్మార్ట్ కార్డులు, క్యూఆర్ టిక్కెట్లపై రాయితీని ఎత్తివేశారు. వీకెండ్ సూపర్ సేవర్ కార్డ్ల ధర కూడా రూ. 59 నుండి రూ. 99కి పెంపు.. ఈ నేపథ్యంలో ఛార్జీల పెంపు ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే మౌలిక వసతులు కల్పించడంలో ఎల్ అండ్ టీ విఫలమవడంతో చార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
భోజనం చేసిన తరువాత స్వీట్స్ తింటే ఎమౌతుందో తెలుసా ?
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..