Site icon NTV Telugu

Hyderabad: హుస్సేన్ సాగర్ లో పేరకు పోయిన వ్యర్థాలు ఎంతంటే..?

Sam (2)

Sam (2)

హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి వీధిలో గణేష్ విగ్రహం ఏర్పాటు చేసి.. ప్రత్యేక పూజలతో గణనాథుడిని ఆరాధించారు. ఇదంతా బాగానే ఉన్నప్పట్టికి.. విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. దాదాపు కొన్ని వేల విగ్రహాలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. అయితే విగ్రహాలతో పాటు 32 వేల టన్నుల చెత్త, వ్యర్థాలు పేరుకు పోయాయని అధికారులు వెల్లడించారు.

రోడ్లపై చెత్తను, ‘సాగర్’​లో వ్యర్థాలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సిబ్బంది ఇంకా తొలగిస్తూనే ఉన్నారు. ఉత్సవాలు జరిగిన11 రోజులపాటు గ్రేటర్​రోడ్లపై భక్తులు 20 వేల టన్నులకు పైగా చెత్త వేశారని అధికారులు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ఒక్కరోజులోనే 4 వేల టన్నుల చెత్త బయటపడిందన్నారు. దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయించామన్నారు జీహెచ్ఎంసీ అధికారు..

రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డులకు తరలించేందుకు 700 వాహనాలను వినియోగించామన్నారు. నిమజ్జనం జరిగిన ప్రాంతాల్లో పేపర్ షాట్లను తొలగించేందుకు ప్రైవేటుకు చెందిన ఒక జటాయ్ యంత్రాన్ని వాడామన్నారు. రోడ్డుపై నుంచి నేరుగా మెషీన్​లోపలకు చెత్తను తీసుకోవడమే దీని ప్రత్యేకత. మిగతా ప్రాంతాల్లో పేపర్ షాట్ల తొలగింపునకు శానిటేషన్ కార్మికులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పారు. తిఏటా నిమజ్జనం చివరి రెండు రోజుల్లోనే ఎక్కువగా చెత్త, వ్యర్థాలు వస్తుండడంతో ఈ ఆదివారం, సోమవారం జీహెచ్ఎంసీ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. సోమవారం సాయంత్రానికి పూర్తిగా వ్యర్థాలను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.

Exit mobile version