Honor Killing: ఇబ్రహీంపట్నంలో పరువుహత్య చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో తన కూతురు కుటుంబ పరువు తీస్తుందని ఓ తల్లి తన కూతురుని చున్నీతో ఉరివేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని దండుమైలారంలో చోటుచేసుకుంది.
Read also: Elections 2024: నేడే కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల లిస్ట్.. ఆశావహుల్లో ప్రముఖులు..!
దండుమైలారంలో జంగమ్మ కుటుంబం నివాసం ఉంటుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. కూతురు భార్గవి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటుంది. అయితే తను చదవున్న కాలేజీలో శశి అనే అబ్బాయి పరిచయమయ్యాడు. కొద్దిరోజులు స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రాను రాను వీరిద్దరు ఎక్కవగా కలవడం మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అయితే ఈ విషయం కాస్తా భార్గవి కుంటుంబ సభ్యులకు తెలియడంతో రచ్చ రచ్చ చేశారు. శశిని కలవకూడదని పరువు పోతుందని ఇది సరైన పద్దతి కాదని ముందు చదువు మీద శ్రద్ద పెట్టాలని భార్గవి తల్లి జంగమ్మ మందలించింది. అయినా భార్గవి కుటుంబాన్ని, తన తల్లి చెప్పిన మాటలను పక్కన పెట్టి శశిని కలవడం మానలేదు. దీంతో ప్రేమ వ్యవహారంలో గత కొద్దిరోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భార్గవి తల్లి నిరాకరించింది. ఏమైందో ఏమో కానీ.. భార్గవి హత్యకు ముందు కలిసేందుకు ప్రియుడు శశి వచ్చాడు.
Read also: Khammam Police: వింత శబ్దాలతో సైలెన్సర్లు పెడితే వాహనాలు సీజ్..!
దీంతో అది చూసిన తల్లి జంగమ్మ ఆగ్రహంతో ఊగిపోయిది. శశి ఇంటికి ఎందుకు వచ్చాడు అని అడిగింది భార్గవి సమాధానం చెప్పకపోవడంతో తల్లి జంగమ్మ రెచ్చిపోయింది. కూతురు భార్గవి ఏం చేస్తుందో ఏమో అని భయపడి చివరకు కన్న కూతురినే చీరతో ఉరి వేసింది. అయితే ఏమీ తెలియనట్లు కూతురు చనిపోయిందని ఏడుస్తూ కూర్చుంది. అయితే ఈ వ్యవహారంపై భార్గవి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కన్నతల్లే భార్గవిని చంపిందని కేసు పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. అయితే భార్గవి హత్యకు ముందు ఇంటికి వచ్చిన శశి ఏం మట్లాడుకున్నారు? ఆతరువాత భార్గవి, తన తల్లి మధ్య ఏం జరిగింది? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు, భార్గవి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నారు.
SSMB29 Update: స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.. సినిమాని వేగంగా పూర్తి చేస్తాం: రాజమౌళి