High Court: సెల్లార్ నిర్మాణాలపై అనుమతి తీసుకోవాలి.. హైకోర్టు ఆదేశం
High Court: అపార్ట్మెంట్లోని బేస్మెంట్లో 2012 భవన నిబంధనల ప్రకారం వాచ్మెన్ గదితోపాటు రెండు మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వీటి నిర్మాణం చేపట్టవచ్చని, అయితే ముందస్తు అనుమతి తప్పనిసరి అని తేల్చింది. హైదరాబాద్లోని మోహన్ నగర్లోని సీటీఓ కాలనీలోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ బిల్డర్ కె.రమేష్ సెల్లార్లో వాచ్మెన్ గది నిర్మాణంపై ఈ నెల 7న జీహెచ్ఎంసీ జారీ చేసిన పోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ అంశంపై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. 500 చదరపు గజాల విస్తీర్ణంలో 15 ప్లాట్లు ఉన్నాయని, భద్రత కోసం సెల్లార్లో వాచ్మెన్ గదిని నిర్మించామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. దీన్ని కూల్చివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. భవన నిబంధనల ప్రకారం వాచ్మెన్ గది నిర్మాణాన్ని చేపట్టవచ్చు. కేవలం షోకాజ్ నోటీసు మాత్రమే ఇచ్చామని, దీనిపై వివరణ ఇచ్చేందుకు పిటిషనర్ కు అవకాశం ఉందని మున్సిపల్ శాఖ తరఫు న్యాయవాది తెలిపారు. వాచ్ మెన్ గది నిర్మాణానికి అనుమతి తీసుకోవాలన్నారు.
Read also: ‘Kalki 2898 AD’ Release Date:కల్కి వాయిదా లేదు.. ఒక్క పోస్టుతో నోళ్లు మూయించారు..
Also Read
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నిబంధనల ప్రకారం వాచ్మెన్ గది నిర్మాణానికి నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నప్పటికీ ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఇక్కడ పిటిషనర్ ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారని, ఈ నెల 24లోగా షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వాలని పిటిషనర్ ను ఆదేశించింది. అంతే కాకుండా వాచ్మెన్ గది నిర్మాణాన్ని క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. షోకాజ్ నోటీసుపై వివరణతో పాటు, పిటిషనర్ క్రమబద్ధీకరణ దరఖాస్తు (అప్లికేషన్స్) చేస్తే, దానిపై నిర్ణయం తీసుకునే వరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు. క్రీడాభివృద్ధిలో భాగంగా ఐఎంజీకి అప్పగించిన భూమిని రిజిస్ట్రేషన్ రద్దు చేయడంపై బాధ్యులైన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని మరో కేసులో హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రయివేటు కంపెనీకి అప్పగించిన భూమికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఏకపక్షంగా భూముల బదలాయింపు కేసులో ప్రభుత్వమే దోషి అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందన్నారు. చట్టం తెచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం 28కి వాయిదా వేసింది.
Dhoni : క్రికెట్ వదిలి ఈ వ్యాపారంలో కోట్లు గడిస్తోన్న ధోనీ
తాజావార్తలు
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!