High Court: సెల్లార్ నిర్మాణాలపై అనుమతి తీసుకోవాలి.. హైకోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: అపార్ట్మెంట్లోని బేస్మెంట్లో 2012 భవన నిబంధనల ప్రకారం వాచ్మెన్ గదితోపాటు రెండు మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వీటి నిర్మాణం చేపట్టవచ్చని, అయితే ముందస్తు అనుమతి తప్పనిసరి అని తేల్చింది. హైదరాబాద్లోని మోహన్ నగర్లోని సీటీఓ కాలనీలోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ బిల్డర్ కె.రమేష్ సెల్లార్లో వాచ్మెన్ గది నిర్మాణంపై ఈ నెల 7న జీహెచ్ఎంసీ జారీ చేసిన పోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ అంశంపై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. 500 చదరపు గజాల విస్తీర్ణంలో 15 ప్లాట్లు ఉన్నాయని, భద్రత కోసం సెల్లార్లో వాచ్మెన్ గదిని నిర్మించామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. దీన్ని కూల్చివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. భవన నిబంధనల ప్రకారం వాచ్మెన్ గది నిర్మాణాన్ని చేపట్టవచ్చు. కేవలం షోకాజ్ నోటీసు మాత్రమే ఇచ్చామని, దీనిపై వివరణ ఇచ్చేందుకు పిటిషనర్ కు అవకాశం ఉందని మున్సిపల్ శాఖ తరఫు న్యాయవాది తెలిపారు. వాచ్ మెన్ గది నిర్మాణానికి అనుమతి తీసుకోవాలన్నారు.
Read also: ‘Kalki 2898 AD’ Release Date:కల్కి వాయిదా లేదు.. ఒక్క పోస్టుతో నోళ్లు మూయించారు..
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నిబంధనల ప్రకారం వాచ్మెన్ గది నిర్మాణానికి నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నప్పటికీ ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఇక్కడ పిటిషనర్ ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారని, ఈ నెల 24లోగా షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వాలని పిటిషనర్ ను ఆదేశించింది. అంతే కాకుండా వాచ్మెన్ గది నిర్మాణాన్ని క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. షోకాజ్ నోటీసుపై వివరణతో పాటు, పిటిషనర్ క్రమబద్ధీకరణ దరఖాస్తు (అప్లికేషన్స్) చేస్తే, దానిపై నిర్ణయం తీసుకునే వరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు. క్రీడాభివృద్ధిలో భాగంగా ఐఎంజీకి అప్పగించిన భూమిని రిజిస్ట్రేషన్ రద్దు చేయడంపై బాధ్యులైన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని మరో కేసులో హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రయివేటు కంపెనీకి అప్పగించిన భూమికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఏకపక్షంగా భూముల బదలాయింపు కేసులో ప్రభుత్వమే దోషి అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందన్నారు. చట్టం తెచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం 28కి వాయిదా వేసింది.
Dhoni : క్రికెట్ వదిలి ఈ వ్యాపారంలో కోట్లు గడిస్తోన్న ధోనీ
తాజావార్తలు
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!