TG High Court: చార్మినార్ ని కూల్చమంటే కూల్చేస్తారా? రంగనాథ్ పై హైకోర్టు సీరియస్..

  • హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం..
  • నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేస్తున్నారో చెప్పాలి..
  • అమీన్ పూర్ గురించి మాత్రమే మాట్లాడండి కావూరి హిల్స్ గురించి అడగలేదు..
Hydera

Hydera

TG High Court: చార్మినార్‌ ని కూల్చివేయమని ఎమ్మార్వో చెబితే మీరు కోల్చేస్తారా? అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బాధితుల పిటిషన్‌ను ధర్మాసనం ఇవాళ విచారించింది. హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు వర్చువల్‌ గా హాజరై వివరణ ఇచ్చారు. అయితే విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రాకు చట్టబద్ధత ఏంటో చెప్పాలని కమిషనర్‌ ప్రశ్నించింది.ఎమ్మార్వో ఆదేశాలు మేరకే కూల్చామని కమిషనర్‌ రంగనాథ్‌ సమాధానం చెప్పడంతో.. హైకోర్టు సీరియస్‌ అయ్యింది. అయితే చార్మినార్‌ని కూల్చివేయమని ఎమ్మ్యేర్వో చెబితే మీరు కూల్చేస్తారా? అని నిలదీసింది..

Read Also: Hassan Nasrallah: హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టిన పైలెట్ కు ఘన స్వాగతం!(వీడియో)

ఇక, విచారణ సందర్భంగా అమీన్‌పూర్ తహసీల్దార్‌ వివరణపై సంతృప్తి చెందని హైకోర్టు న్యాయమూర్తి.. ఆదివారం నాడు ఎలా కూలుస్తారని ఎమ్మార్వో పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చి.. 40 గంటల్లోపే భవనాన్ని ఎలా కూలుస్తారు..? అని నిలదీసింది.. ఇలా కూల్చివేతలు చేస్తే ఇంటికి వెళ్లిపోతారంటూ ఎమ్మార్వోను హెచ్చరించింది.. మరోవైపు.. నేనడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి… జంప్ చేయకండి. అమీన్ పూర్ గురించి మాత్రమే మాట్లాడండి.. అంతేకానీ.. కావూరి హిల్స్ గురించి నేను అడగలేదు.. అంటూ హైడ్రా కమిషనర్‌ కు చురకలు అంటించింది హైకోర్టు.. ఇక, కోర్టు పరిధిలోని భవనాలను హైడ్రా కూల్చివేయడంపై గత విచారణలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోర్టుకు హాజరుకావాలని హైడ్రా కమిషనర్‌కు కోర్టు నోటీసులు జారీ చేయడంతో రంగనాథ్ ఈరోజు వర్చువల్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు.