YS Sharmilas Sensational Comments: రేవంత్, బండి సంజయ్ పై షర్మిళ సంచలన వ్యాఖ్యలు
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా సీఎం పై తీవ్ర ఆరోపణలు చేసారు. మెగా కృష్ణారెడ్డి రూ.70వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని, నల్లధనం ఉందని.. ఇందుకు సంబంధించి రూ.12వేల కోట్ల GST కట్టాల్సి ఉంటుందని స్వయంగా GST ఇంటెలిజెన్స్ చెబుతున్నా.. KCR ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మీ ఇద్దరు తోడు దొంగలేనా? అంటూ విమర్శించారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా మెగా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారు? అని ప్రశ్నంచారు. మా తెలంగాణ వాళ్ళకి కాంట్రాక్ట్ పనులు చేయడం రాదా? లేక ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని దోచుకోవచ్చనా? అంటూ ఎద్దేవ చేసారు. ఈ విషయంపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? మెగా కృష్ణారెడ్డి మీకు కూడా దోస్తు కాబట్టి, మీకు ముడుపులు అందుతున్నాయి కాబట్టి మాట్లాడటం లేదా? అంటూ వైఎస్ షర్మిళ మండిపడ్డారు.
మెగా కృష్ణారెడ్డి రూ.70వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని, నల్లధనం ఉందని.. ఇందుకు సంబంధించి రూ.12వేల కోట్ల GST కట్టాల్సి ఉంటుందని స్వయంగా GST ఇంటెలిజెన్స్ చెబుతున్నా KCR ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.మీ ఇద్దరు తోడు దొంగలనా? రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా మెగా కృష్ణారెడ్డికే
1/2 pic.twitter.com/eRqG7rkLy9Also Read
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
- Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!
- Kavitha: ప్రస్తుత పాలకులకు అమ్మతనం లేదు.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు
— YS Sharmila (@realyssharmila) July 23, 2022
భద్రాద్రి వరదల పట్ల ముందస్తు హెచ్చరికలు చేయక పోవడం వల్ల గోదావరి పరివాహక ప్రాంతాలు తీవ్రనష్టం చవిచూశాయని షర్మిల మండిపడ్డారు. ఇల్లు, వాకిలి వదిలి కట్టుబట్టలతో ఉన్న నిర్వాసితులకు ప్రభుత్వం చేసిన సాయం ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. వరద బడుతులకు తినడానికి వీలు లేని బియ్యాన్ని ఇచ్చారు.. బాధితులు తమ గోడును లెల్లబోసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇల్లు పంటలు అంతా నష్టమే.. సీఎం కేసీఆర్ భద్రాచలం వచ్చి పోయారు.. హామీలు ఇచ్చారు నేటి వరకు ఏ సాయము ప్రజలకు అందలేదని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వకుంటే బాధితులు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ఇల్లు, పంట, జీవనోపాధి అన్ని ఆర్ధిక నష్టాలే.. బాధిత ప్రజల గోస చెప్పలేనిదని షర్మిళ ఆవేదన వ్యక్తం చేసారు.
ఈనేపథ్యంలో.. నష్టపరిహారం ఇస్తామని హామీ ఇవ్వడం..మరిచి పోవడమే కేసీఆర్ కు తెలుసని విమర్శించారు. శనివారం పినపాక మండలం రావి గూడెం గ్రామంలో పర్యటించిన షర్మిల గోదావరి వరదలతో మునిగిపోయిన ఇళ్లను పరిశీలించిన ఆమో మాట్లాడుతూ… గతంలో వరంగల్, ఖమ్మం రైతులను ఇలానే మోసం చేశారని మండిపడ్డారు. ఫామ్ హౌజ్లో పడుకుంటారని దుయ్యబట్టారు. వానలతో .. వరదలతో ప్రజలు సర్వం కోల్పోయారన్నారు. ప్రజలకు తక్షణ సహాయం చేయలేని ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు అంటూ షర్మిళ ప్రశ్నించారు. మీకు పరిపాలన చేతకాక పోతే రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయండని మండిపడ్డారు. మీరు ఇంకా పదవిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారు, లక్షల మంది జీవితాలు ఆగం అయ్యాయయని ఆగ్రమం వ్యక్తం చేసారు. బాధితులకు ఇస్తామని చెప్పిన రూ.10 వేల సహాయం కూడా ఇంకా అందలేదని, అయినా.. 10 వేలు ఎటూ సరిపోవని రూ.25 వేలు సహాయం అందించాలని డిమాండ్ చేసారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలంటూ షర్మిల డిమాండ్ చేశారు.
Srisailam Dam Gates Lifted: శ్రీశైలంలో అద్భుత దృశ్యం.. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత..
తాజావార్తలు
-
Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
-
US-Iran War: “ట్రంప్పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
-
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!