Telangana Assembly: అసెంబ్లీకి ఆటోలో వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. మండలిలో నిరసన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly:ఆటో డ్రైవర్లపై ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లార్ రెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్… హైదరాబాద్ హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. రెండు నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. డిమాండ్ లేకపోవడంతో 6.5 లక్షల మంది ఆటో కార్మికులు ఈఎంఐ చెల్లించలేక పస్తులుంటున్నారని వెల్లడించారు. చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు నెలకు రూ.10 జీవనభృతి కల్పించే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో పొందుపర్చాలి.
Read also: HMDA Siva Balakrishna: శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు.. ఐఏఎస్ అధికారి పేరు..!
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
బీఆర్ఎస్ నిరసన..
మండలి సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. కౌన్సిల్ పోడియం వద్ద నిరసన తెలిపారు. నల్ల కండువాలతో నిరసన తెలిపారు. దీంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. సీఎంపై ఫిర్యాదును అసెంబ్లీ కార్యదర్శికి పంపినట్లు మండలి చైర్మన్ తెలిపారు. కాగా, మండలి సభ్యులను ముఖ్యమంత్రి అవమానించారని ఎమ్మెల్సీ భాను ప్రసాద్ అన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. సభా గౌరవాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మోతె శోభన్ రెడ్డిని అసెంబ్లీలోకి నల్ల కండువాలు తీసుకువస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నల్ల కండువాలు ధరించి రావొద్దని చెప్పారు. దీంతో ఎమ్మెల్సీలు, మార్షల్స్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసన తెలపడం తమ హక్కు అని, సస్పెండ్ చేయాలని కోరితే ఎమ్మెల్సీలు భానుప్రసాద్, శోభన్ రెడ్డి, తాతా మధు, మహమూద్ అలీ సభ లోపలికి వెళ్లారు.
Pakistan : పాకిస్తాన్ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
- Tags
తాజావార్తలు
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
-
Team India Selection: బీసీసీఐ కీలక మీటింగ్.. యువ పేసర్లకు ఛాన్స్, సీనియర్లకు షాక్ తప్పదా?
-
KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్కు చావోరేవో.. ప్లేఆఫ్స్కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!