Harish Rao: ఆటో EMI కట్టలేకపోతున్నాం.. హరీష్ రావుతో ఆటో డ్రైవర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad MMTS: సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పర్యటించారు. పటాన్ చెరు బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు హరీశ్ రావు. ఈ సందర్భంగా పలువురు ఆటో కార్మికులు ఈఎంఐలు కూడా చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడ్డామని వాపోయారు. మాకు సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వాన్ని వేడుకున్నట్లు తెలిపారు. కుటుంబ పోషణకు ఆటో నడపడం ఒక్కటే మార్గమని దిక్కని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఉచిత బస్సు మంచిదే అయినా కస్టమర్లు లేక ఆటోలు నడపలేకపోతున్నామని అన్నారు. రోజుకు రూ.100 కూడా సంపాదించే పరిస్థితి లేదని వాపోయారు. కొత్త తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన హరీష్ రావు.. ఆటో డ్రైవర్లకు అండగా నిలుస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసమస్యల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఆటోడ్రైవర్లకు హితవు పలికారు. 6.5 లక్షల మంది ఆటోడ్రైవర్ల తరపున అసెంబ్లీలో బీఆర్ఎస్ గళం వినిపిస్తామన్నారు. ఆత్మహత్యల వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ప్రభుత్వం నెలకు 10 వేలు ఇచ్చే వరకు పోరాడుతామని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఆటో కార్మికులు తదితరులు ఉన్నారు.
Read also: Telangana Govt: పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం సత్కారం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు
Also Read
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
KRMB విషయంలో కాంగ్రెస్ చేతులెత్తేసిందని అన్నారు. మేం గెలిచాక 15 వేల రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. వడ్లకు బోనస్, వృద్ధాప్య పెన్షన్ పెంపు, 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ప్రచారం చేశారని,, ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టింది..12 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తే ఇప్పుడు 15 నుంచి 16 గంటల కరెంటు వస్తుందన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఇన్వెటర్లు, జనరేటర్లకి డిమాండ్ పెరిగిందన్నారు. గల్లీలో, ఢిల్లీలో ఎవరన్నా తెలంగాణ ప్రజల తరపున పోరాడేది BRS మాత్రమే అన్నారు. మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని 40 సీట్లు తెచ్చుకోమని ఛాలెంజ్ చేసిందని, ఇండియా కూటమి పని అయిపోయింది..ఒక్కొక్కరు కూటమి నుంచి బయటికి వస్తున్నారని తెలిపారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చితే మేం శభాష్ అంటామన్నారు. నిరుద్యోగులకు ఫిబ్రవరి 1న గ్రూప్ నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనకి స్పీడ్ బ్రేకర్ లాంటివన్నారు. రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ లో ఐదేళ్లకే కాంగ్రెస్ ఇంటి బాట పట్టిందన్నారు. బీజేపీ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఒక్క రూపాయి అయినా తెలంగాణకి తెచ్చాడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలో వచ్చే పరిస్థితి లేదన్నారు. రాముడు అందరి వాడు..రాజకీయంగా వాడుకొని ఓట్లు అడుగుతామంటే ఎవరు వెయ్యరన్నారు. ఏం చేశారో చెప్పుకోవడానికి ఏం లేక దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్నారన్నారు.
తాజావార్తలు
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!