Harish Rao: పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు.. రాష్ట్ర సర్కార్ ను హరీష్ రావు ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర సర్కార్ ను అడుగుతున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నం కాబట్టి విమర్శ చేయాలని కాదన్నారు. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని తెలిపారు. రైతులకు బోనస్ ఇస్తాం అని ఎన్నికల సమయంలో చెప్పారు బోనస్ కింది 5 వందల రూపాయలు ఇస్తాం అన్నారని తెలిపారు. వడ్లకు 5 వందల బోనస్ ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. వడ్లు కొనుగోలు ఎప్పుడు చేస్తారు చెప్పాలి అని అడుగుతున్నామని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రైతు బంధు పెంచుతాం అన్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రైతు బంధు కింద 15 వేల రూపాయలు ఇస్తామని, డిసెంబర్ 9 న ఇస్తాం అని మాట ఇచ్చారని గుర్తు చేశారు. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను అడుగుతున్నామని హరీష్ రావు అన్నారు.
Read also: Bigg Boss Telugu 7: ఈ వారం ఓటింగ్ రిజల్ట్స్.. ఆ ఇద్దరు అవుట్?
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
బీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు కాకుండా మరొకరు వస్తారనే ఊహాగానాలు ఇటీవల జోరందుకున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి రారని, పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాల్లో బిజీ అవుతారని కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ కు అలాంటి ఆలోచన లేదని తేలిపోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. అంటే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు మొదలవుతుందని తెలుస్తోంది. కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య మరింత అగ్గి రాజేస్తున్నాయి.
విద్యుత్ శాఖ విషయంలో గత ప్రభుత్వం మోపిన భారంపై ఇప్పటికే కాంగ్రెస్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు… ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు గెలుపొందారు. కాబట్టి వారు రెండు స్థానాల్లో ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈరోజు అసెంబ్లీకి రాకముందే ముగ్గురు ఎమ్మెల్సీలు శాసనమండలికి వెళ్లి రాజీనామాలు సమర్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిల రాజీనామాలను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు.
Read also: Kesineni Nani: చంద్రబాబు, ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం.. ఈ కార్యక్రమం నా అదృష్టం
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!