Harish Rao: సొంత రాష్ట్రాల్లో హామీలు అమలు చెయ్యరు కానీ.. ఈడికొచ్చి కల్లిబొల్లి మాటలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: సొంత రాష్ట్రాల్లో హామీలు అమలు చెయ్యచేతగాదు కానీ..ఇక్కడ మాత్రం చేస్తామని కల్లి బొల్లి మాటలు చెబుతున్నారని కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్టాల్లో దివ్యంగులకు వెయ్యి రూపాయల పింఛన్ మాత్రమే ఇస్తున్నారని అన్నారు. దివ్యంగులకు 4016 రూపాయల పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లయితే పడని…హామీలు ఎగబెట్టుదాం అని చూస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్ముతే ఎండమావులకు ఆశపడ్డట్టు అవుతుందని అన్నారు. వాళ్ళ సొంత రాష్ట్రాల్లో హామీలు అమలు చెయ్యచేతగాదు కానీ..ఇక్కడ మాత్రం చేస్తామని కల్లి బొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. సిద్దిపేటలో ఏ ఎన్నిక జరిగినా ఏకగ్రీవమేనని సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు మరోసారి నిరూపించారని తెలిపారు.
Read also: SBI Debit Card: ఎస్బిఐ ఎటీఎం కార్డు వాడట్లేదా? ఏం జరుగుతుందో తెలుసా?
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
ఒకవైపు పట్టణ ప్రజలు మరోవైపు పలు గ్రామాల్లో కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మంత్రి హరీశ్ రావుకు, బీఆర్ ఎస్ పార్టీకి జై కొడుతున్నారని తెలిపారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్ కుల సంఘాల నాయకులు మంత్రిని కలిసి అండగా ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు అందించారని అన్నారు. సిద్దిపేట ప్రజల ఆదరాభిమానాలు, అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారని అన్నారు. అంతా కలిసికట్టుగా ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకోవడం బీఆర్ఎస్ పార్టీపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి అని అన్నారు. ఇవాళ సాయంత్రం సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్లొననున్నారు. సాయంత్రం కోమటి చెరువులో దాదాపు 4500 డ్రోన్లతో డ్రోన్ షో నిర్వహణ కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దిని డ్రోన్ షో ద్వారా తెలిసేలా నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
-
India T20 Captaincy: సూర్యకుమార్కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
-
Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!