Harish Rao: సొంత రాష్ట్రాల్లో హామీలు అమలు చెయ్యరు కానీ.. ఈడికొచ్చి కల్లిబొల్లి మాటలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: సొంత రాష్ట్రాల్లో హామీలు అమలు చెయ్యచేతగాదు కానీ..ఇక్కడ మాత్రం చేస్తామని కల్లి బొల్లి మాటలు చెబుతున్నారని కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్టాల్లో దివ్యంగులకు వెయ్యి రూపాయల పింఛన్ మాత్రమే ఇస్తున్నారని అన్నారు. దివ్యంగులకు 4016 రూపాయల పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లయితే పడని…హామీలు ఎగబెట్టుదాం అని చూస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్ముతే ఎండమావులకు ఆశపడ్డట్టు అవుతుందని అన్నారు. వాళ్ళ సొంత రాష్ట్రాల్లో హామీలు అమలు చెయ్యచేతగాదు కానీ..ఇక్కడ మాత్రం చేస్తామని కల్లి బొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. సిద్దిపేటలో ఏ ఎన్నిక జరిగినా ఏకగ్రీవమేనని సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు మరోసారి నిరూపించారని తెలిపారు.
Read also: SBI Debit Card: ఎస్బిఐ ఎటీఎం కార్డు వాడట్లేదా? ఏం జరుగుతుందో తెలుసా?
Also Read
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ఒకవైపు పట్టణ ప్రజలు మరోవైపు పలు గ్రామాల్లో కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మంత్రి హరీశ్ రావుకు, బీఆర్ ఎస్ పార్టీకి జై కొడుతున్నారని తెలిపారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్ కుల సంఘాల నాయకులు మంత్రిని కలిసి అండగా ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు అందించారని అన్నారు. సిద్దిపేట ప్రజల ఆదరాభిమానాలు, అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారని అన్నారు. అంతా కలిసికట్టుగా ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకోవడం బీఆర్ఎస్ పార్టీపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి అని అన్నారు. ఇవాళ సాయంత్రం సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్లొననున్నారు. సాయంత్రం కోమటి చెరువులో దాదాపు 4500 డ్రోన్లతో డ్రోన్ షో నిర్వహణ కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దిని డ్రోన్ షో ద్వారా తెలిసేలా నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!