Harish Rao: సొంత రాష్ట్రాల్లో హామీలు అమలు చెయ్యరు కానీ.. ఈడికొచ్చి కల్లిబొల్లి మాటలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: సొంత రాష్ట్రాల్లో హామీలు అమలు చెయ్యచేతగాదు కానీ..ఇక్కడ మాత్రం చేస్తామని కల్లి బొల్లి మాటలు చెబుతున్నారని కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్టాల్లో దివ్యంగులకు వెయ్యి రూపాయల పింఛన్ మాత్రమే ఇస్తున్నారని అన్నారు. దివ్యంగులకు 4016 రూపాయల పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లయితే పడని…హామీలు ఎగబెట్టుదాం అని చూస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్ముతే ఎండమావులకు ఆశపడ్డట్టు అవుతుందని అన్నారు. వాళ్ళ సొంత రాష్ట్రాల్లో హామీలు అమలు చెయ్యచేతగాదు కానీ..ఇక్కడ మాత్రం చేస్తామని కల్లి బొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. సిద్దిపేటలో ఏ ఎన్నిక జరిగినా ఏకగ్రీవమేనని సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు మరోసారి నిరూపించారని తెలిపారు.
Read also: SBI Debit Card: ఎస్బిఐ ఎటీఎం కార్డు వాడట్లేదా? ఏం జరుగుతుందో తెలుసా?
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
ఒకవైపు పట్టణ ప్రజలు మరోవైపు పలు గ్రామాల్లో కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మంత్రి హరీశ్ రావుకు, బీఆర్ ఎస్ పార్టీకి జై కొడుతున్నారని తెలిపారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్ కుల సంఘాల నాయకులు మంత్రిని కలిసి అండగా ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు అందించారని అన్నారు. సిద్దిపేట ప్రజల ఆదరాభిమానాలు, అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారని అన్నారు. అంతా కలిసికట్టుగా ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకోవడం బీఆర్ఎస్ పార్టీపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి అని అన్నారు. ఇవాళ సాయంత్రం సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్లొననున్నారు. సాయంత్రం కోమటి చెరువులో దాదాపు 4500 డ్రోన్లతో డ్రోన్ షో నిర్వహణ కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దిని డ్రోన్ షో ద్వారా తెలిసేలా నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
-
King 100: నాగ్100పై సస్పెన్స్కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
-
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!