Woman Dead Body: మూసిలో కొట్టుకొచ్చిన డెడ్ బాడీ.. ఆ మహిళ అనే అనుమానం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Dead Body: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణుకుతోంది. భారీ వర్షాలకు రోడ్లు, లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుతుండగా గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసారాంబాగ్ వంతెన వద్ద నీటి ప్రవాహం పెరిగింది. వంతెన సమీపంలో వరద నీరు ప్రవహించడంతో మంగళవారం (సెప్టెంబర్ 5) రాత్రి 9 గంటల నుంచి ముసారాంబాగ్ వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల ముసారాంబాగ్ వంతెనపై వరద తగ్గుముఖం పట్టడంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్కు అనుమతి ఇచ్చారు.
మూసీ వరద నీటితో వంతెనపై పేరుకుపోయిన చెత్తను జీహెచ్ఎంసీ కార్మికులు తొలగిస్తున్నారు. వంతెన వద్ద చెత్తను తొలగిస్తుండగా గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో అదృశ్యమైన లక్ష్మి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వరద నీటిలో లక్ష్మి మృతదేహాన్ని బయటకు తీసి మృతదేహాన్ని గుర్తించేందుకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. లక్ష్మి కూతురు అక్కడికి చేరుకుని ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు, ముక్కు పగలడం ఆధారంగా తల్లి లక్ష్మిగా గుర్తించారు. అమ్మ మాకు దూరం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడమ చేతిపై తన స్నేహితురాలి పచ్చబొట్టు పేరు కమలమ్మ అని రాయించుకుందని తెలిపారు. ముకుపుల్ల & పచ్చబొట్టు దాని ఆధారంగా మా అమ్మ మృతదేహంగా గుర్తించామన్నారు. తన తల్లి లక్ష్మి మృతదేహం కోసం నాలుగు రోజులు వెతకామని తెలిపారు. అధికారులు తీవ్రంగా శ్రమించారని, ఈ రోజు మా అమ్మ మాకు లేదని కన్నీరుమున్నీరయ్యారు.
Also Read
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
- Jagadish Reddy : పవన్ కళ్యాణ్ చదువుతోంది మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్
- Off The Record : బడే భాయ్ తో యుద్ధానికి తెలంగాణ సీఎం సిద్ధం..?
Read also: Hyderabad: ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. టైమింగ్ మారుస్తారా..?
మూడు రోజుల క్రితం గల్లంతు..
గాంధీనగర్కు చెందిన లక్ష్మి అనే మహిళ నాలుగు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో అదృశ్యమైంది. ఆమె నాలాపై ఇల్లు కట్టుకుంది. ఇటీవల వర్షం కారణంగా ఇంటి గోడ కూలిపోయింది. సోమవారం ఉదయం నుంచి ఆమె కనిపించకుండా పోయింది. అయితే ఆమె నాలాలో పడి కొట్టుకుపోయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఆమె ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంట్లోకి వెళ్లిన లక్ష్మి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు నాలా దగ్గర లక్ష్మి కంకణాలు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. తాజాగా ఆమె మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.
Bharat: తాజాగా “ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్”.. మరోసారి పేరు మార్పు..
తాజావార్తలు
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!