CM KCR Review: నీటిపారుదల శాఖపై సీఎం సమీక్ష.. ఇంజనీర్స్ తో కేసీఆర్ రివ్యూ..
CM KCR Review: నేడు సచివాలయంలో నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్స్ తో సీఎం కేసీఆర్ రివ్యూ చేయనున్నారు. త్వరలోనే నార్లాపూర్ పంప్ హౌస్ వెట్ రన్ తోపాటు ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన ఏర్పాట్లపై రివ్యూ చేసే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరుకానున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ విస్తృతంగా చర్చించనున్నారు. ఇటీవల ప్రాజెక్టుకు సంబంధించి డ్రై రన్ నిర్వహించారు. డ్రై రన్ విజయవంతం కావడంతో వెట్ రన్ కు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 15 లేదా 17న ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కరివెన జలాశయం వరకు నీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్షించనున్నారు. అక్కడక్కడా పూర్తి చేయాల్సిన పనులు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తదితర అంశాలపై సీఎం దృష్టి సారించి.. కాల్వల నిర్మాణ ప్రక్రియను కూడా ప్రారంభించారు. అన్న అంశాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నార్లాపూర్లో ఇటీవల నిర్వహించిన డ్రై రన్ను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ప్రారంభించిన అనంతరం రాష్ట్ర నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా నార్లాపూర్ వద్ద 4 మోటార్లు బిగించారు. మొదటి పంపు విజయవంతంగా పరీక్షించబడింది. వచ్చే 15 రోజుల్లో పంపు ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఒక మోటారు 3 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. నిబంధనల ప్రకారం ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్ నిండిన తర్వాత 45 రోజుల్లో ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లకు నీటిని తీసుకెళ్లనున్నారు. పర్యావరణ అనుమతులు వచ్చిన 3 వారాలుగా ఇంజినీర్లు, సిబ్బంది పగలు, రాత్రి పని చేస్తున్నారని వివరించారు. చిన్న చిన్న సమస్యలు, పనులు మిగిలిపోయాయని.. మిషన్ భగీరథకు సంబంధించి వట్టెం వద్ద పైపు మార్చే పనులతో పాటు కుడికిల వద్ద డీప్ కట్ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మహబూబ్నగర్ జిల్లాకు విపత్తుగా అభివర్ణించిన విషయం తెలిసిందే..
Tirupati Crime: ఫేస్బుక్లో ప్రేమించుకున్నారు.. పెళ్లితో ఒక్కటయ్యారు.. ఆస్తి చిచ్చు పెట్టింది..!
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!