CM KCR Review: నీటిపారుదల శాఖపై సీఎం సమీక్ష.. ఇంజనీర్స్ తో కేసీఆర్ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Review: నేడు సచివాలయంలో నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్స్ తో సీఎం కేసీఆర్ రివ్యూ చేయనున్నారు. త్వరలోనే నార్లాపూర్ పంప్ హౌస్ వెట్ రన్ తోపాటు ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన ఏర్పాట్లపై రివ్యూ చేసే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరుకానున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ విస్తృతంగా చర్చించనున్నారు. ఇటీవల ప్రాజెక్టుకు సంబంధించి డ్రై రన్ నిర్వహించారు. డ్రై రన్ విజయవంతం కావడంతో వెట్ రన్ కు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 15 లేదా 17న ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కరివెన జలాశయం వరకు నీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్షించనున్నారు. అక్కడక్కడా పూర్తి చేయాల్సిన పనులు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తదితర అంశాలపై సీఎం దృష్టి సారించి.. కాల్వల నిర్మాణ ప్రక్రియను కూడా ప్రారంభించారు. అన్న అంశాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నార్లాపూర్లో ఇటీవల నిర్వహించిన డ్రై రన్ను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ప్రారంభించిన అనంతరం రాష్ట్ర నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా నార్లాపూర్ వద్ద 4 మోటార్లు బిగించారు. మొదటి పంపు విజయవంతంగా పరీక్షించబడింది. వచ్చే 15 రోజుల్లో పంపు ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఒక మోటారు 3 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. నిబంధనల ప్రకారం ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్ నిండిన తర్వాత 45 రోజుల్లో ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లకు నీటిని తీసుకెళ్లనున్నారు. పర్యావరణ అనుమతులు వచ్చిన 3 వారాలుగా ఇంజినీర్లు, సిబ్బంది పగలు, రాత్రి పని చేస్తున్నారని వివరించారు. చిన్న చిన్న సమస్యలు, పనులు మిగిలిపోయాయని.. మిషన్ భగీరథకు సంబంధించి వట్టెం వద్ద పైపు మార్చే పనులతో పాటు కుడికిల వద్ద డీప్ కట్ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మహబూబ్నగర్ జిల్లాకు విపత్తుగా అభివర్ణించిన విషయం తెలిసిందే..
Tirupati Crime: ఫేస్బుక్లో ప్రేమించుకున్నారు.. పెళ్లితో ఒక్కటయ్యారు.. ఆస్తి చిచ్చు పెట్టింది..!
తాజావార్తలు
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!