CM KCR Review: నీటిపారుదల శాఖపై సీఎం సమీక్ష.. ఇంజనీర్స్ తో కేసీఆర్ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Review: నేడు సచివాలయంలో నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్స్ తో సీఎం కేసీఆర్ రివ్యూ చేయనున్నారు. త్వరలోనే నార్లాపూర్ పంప్ హౌస్ వెట్ రన్ తోపాటు ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన ఏర్పాట్లపై రివ్యూ చేసే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరుకానున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ విస్తృతంగా చర్చించనున్నారు. ఇటీవల ప్రాజెక్టుకు సంబంధించి డ్రై రన్ నిర్వహించారు. డ్రై రన్ విజయవంతం కావడంతో వెట్ రన్ కు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 15 లేదా 17న ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కరివెన జలాశయం వరకు నీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్షించనున్నారు. అక్కడక్కడా పూర్తి చేయాల్సిన పనులు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తదితర అంశాలపై సీఎం దృష్టి సారించి.. కాల్వల నిర్మాణ ప్రక్రియను కూడా ప్రారంభించారు. అన్న అంశాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నార్లాపూర్లో ఇటీవల నిర్వహించిన డ్రై రన్ను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ప్రారంభించిన అనంతరం రాష్ట్ర నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా నార్లాపూర్ వద్ద 4 మోటార్లు బిగించారు. మొదటి పంపు విజయవంతంగా పరీక్షించబడింది. వచ్చే 15 రోజుల్లో పంపు ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఒక మోటారు 3 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. నిబంధనల ప్రకారం ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్ నిండిన తర్వాత 45 రోజుల్లో ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లకు నీటిని తీసుకెళ్లనున్నారు. పర్యావరణ అనుమతులు వచ్చిన 3 వారాలుగా ఇంజినీర్లు, సిబ్బంది పగలు, రాత్రి పని చేస్తున్నారని వివరించారు. చిన్న చిన్న సమస్యలు, పనులు మిగిలిపోయాయని.. మిషన్ భగీరథకు సంబంధించి వట్టెం వద్ద పైపు మార్చే పనులతో పాటు కుడికిల వద్ద డీప్ కట్ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మహబూబ్నగర్ జిల్లాకు విపత్తుగా అభివర్ణించిన విషయం తెలిసిందే..
Tirupati Crime: ఫేస్బుక్లో ప్రేమించుకున్నారు.. పెళ్లితో ఒక్కటయ్యారు.. ఆస్తి చిచ్చు పెట్టింది..!
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..