Woman Dead Body: మూసిలో కొట్టుకొచ్చిన డెడ్ బాడీ.. ఆ మహిళ అనే అనుమానం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Dead Body: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణుకుతోంది. భారీ వర్షాలకు రోడ్లు, లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుతుండగా గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసారాంబాగ్ వంతెన వద్ద నీటి ప్రవాహం పెరిగింది. వంతెన సమీపంలో వరద నీరు ప్రవహించడంతో మంగళవారం (సెప్టెంబర్ 5) రాత్రి 9 గంటల నుంచి ముసారాంబాగ్ వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల ముసారాంబాగ్ వంతెనపై వరద తగ్గుముఖం పట్టడంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్కు అనుమతి ఇచ్చారు.
మూసీ వరద నీటితో వంతెనపై పేరుకుపోయిన చెత్తను జీహెచ్ఎంసీ కార్మికులు తొలగిస్తున్నారు. వంతెన వద్ద చెత్తను తొలగిస్తుండగా గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో అదృశ్యమైన లక్ష్మి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వరద నీటిలో లక్ష్మి మృతదేహాన్ని బయటకు తీసి మృతదేహాన్ని గుర్తించేందుకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. లక్ష్మి కూతురు అక్కడికి చేరుకుని ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు, ముక్కు పగలడం ఆధారంగా తల్లి లక్ష్మిగా గుర్తించారు. అమ్మ మాకు దూరం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడమ చేతిపై తన స్నేహితురాలి పచ్చబొట్టు పేరు కమలమ్మ అని రాయించుకుందని తెలిపారు. ముకుపుల్ల & పచ్చబొట్టు దాని ఆధారంగా మా అమ్మ మృతదేహంగా గుర్తించామన్నారు. తన తల్లి లక్ష్మి మృతదేహం కోసం నాలుగు రోజులు వెతకామని తెలిపారు. అధికారులు తీవ్రంగా శ్రమించారని, ఈ రోజు మా అమ్మ మాకు లేదని కన్నీరుమున్నీరయ్యారు.
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
Read also: Hyderabad: ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. టైమింగ్ మారుస్తారా..?
మూడు రోజుల క్రితం గల్లంతు..
గాంధీనగర్కు చెందిన లక్ష్మి అనే మహిళ నాలుగు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో అదృశ్యమైంది. ఆమె నాలాపై ఇల్లు కట్టుకుంది. ఇటీవల వర్షం కారణంగా ఇంటి గోడ కూలిపోయింది. సోమవారం ఉదయం నుంచి ఆమె కనిపించకుండా పోయింది. అయితే ఆమె నాలాలో పడి కొట్టుకుపోయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఆమె ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంట్లోకి వెళ్లిన లక్ష్మి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు నాలా దగ్గర లక్ష్మి కంకణాలు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. తాజాగా ఆమె మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.
Bharat: తాజాగా “ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్”.. మరోసారి పేరు మార్పు..
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!