గాంధీ హాస్పిటల్ అత్యాచార ఘటన.. 7గురు అరెస్ట్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న గాంధీ ఆస్పత్రిలో కీచక పర్వం కలకలం రేపుతోంది. నిత్యం వందలాది మంది రోగులు వచ్చిపోయే గాంధీ ఆస్పత్రిలో.. తమపై గ్యాంగ్రేప్ జరిగిందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.అనారోగ్యంతో బాధపడుతున్న బావకు సహాయంగా అక్కతో పాటు తానుగాంధీ ఆస్పత్రికి వచ్చామని.. మత్తు మందిచ్చి, ఆస్పత్రి సెల్లార్లో లైంగికదాడి చేశారని బాధిత మహిళ ఆరోపించింది. మహబూబ్నగర్కు చెందిన ఓ వ్యక్తికి రెండు కిడ్నీలూ పాడైపోవడంతో … ఈ నెల 4న ఆయనను గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. అతడికి సహాయకులుగా అతడి భార్య, మరదలు ఆస్పత్రిలో ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలో రేడియాలజీ విభాగంలో డార్క్రూమ్ అసిస్టెంట్గా పనిచేసే ఉమామహేశ్వర్ అనే వ్యక్తి వారికి బంధువు. అతడి సహకారంతోనే ఆమె తన భర్తను గాంధీ ఆస్పత్రిలో చేర్చింది. ఏడో తేదీ నుంచి ఆమె, ఆమె చెల్లెలు ఇద్దరూ పేషెంట్ వద్దకు వెళ్లట్లేదు.
Also Read
ఈ నెల 9వ తేదీన పేషెంట్ కుమారుడు.. తండ్రి వద్దకు వచ్చాడు. తల్లి, పిన్ని ….7వ తేదీ నుంచి తండ్రి వద్దకు రావట్లేదని తెలియడంతో.. వారి కోసం వెతికినా ఆచూకీ లేకపోవడంతో 11వ తేదీన తండ్రిని ఇంటికి తీసుకెళ్లాడు. ఆదివారంనాడు బాధిత మహిళ కుమారుడికి ఫోన్ చేసిన ఉమామహేశ్వర్ .. ఆస్పత్రి వెనుక భాగంలో ఖాళీ ప్రదేశంలో మీపిన్ని ఉంది అని చెప్పడంతో వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న పిన్నికి సపర్యలు చేసి ప్రశ్నించగా.. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిపిందన్నాడు. తల్లి ఆచూకీ గురించి అడిగినా చెప్పలేకపోయిందని.. ఆమె తేరుకుంటే అన్ని వివరాలూ తెలుస్తాయనే ఉద్దేశంతో తమ ఊరికి తీసుకెళ్లానని తెలిపాడు.
సోమవారం ఉదయానికి కోలుకున్న బాధితురాలు.. తనపై ఉమామహేశ్వర్, మరో నలుగురు అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపింది. జేబురుమాలులో మత్తుమందు స్ర్పే చేసి నోటికి అదిమిపెట్టారని.. తాను స్పృహ తప్పాక సెల్లార్లోని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారని కన్నీరుమున్నీరైంది. బాధితురాలిని తీసుకుని ఆమె బంధువులు సోమవారం మధ్యాహ్నం చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఆమె ఫిర్యాదుతో ఉమామహేశ్వర్పై రేప్ కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. బాధితురాలి అక్క ఆచూకీ తెలుసుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ఈ నెల 7 నుంచి 15వ తేదీ దాకా వారిద్దరూ ఎక్కడ ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఐదు రోజులుగా ఉమామహేశ్వర్ విధులకు సరిగ్గా హాజరు కావట్లేదని.. ఒకవేళ వచ్చినా రెండు, మూడుగంటలు పనిచేసి కంగారుగా వెళ్లిపోతున్నాడని, తోటి ఉద్యోగులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనలో పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!