NTV Telugu Site icon

Gaddam Prasad Kumar : దక్షిణ తెలంగాణ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంది

సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ చేశానని చెప్పడం పచ్చి అబద్ధం చెబుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణ తెలంగాణ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రాణహిత – చేవెళ్ల క్లోజ్ చేశారని ఆయన విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతలను ఆపేశారు. పాలమూరు రంగారెడ్డి అలైన్మెంట్ మార్చి .. ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు అని ఆయన అన్నారు. వికారాబాద్ ను ఔషధ నగరం చేస్తానని మాయమాటలు చెప్పారని ఆయన ఆరోపించారు. ఈ అన్యాయాలపై 26న బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

అనంతరం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మన ఊరు- మన పోరు పేరుతో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ నెల 26న పరిగిలో భారీ బహిరంగ పెడుతున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, మోసాలపై సమరశంఖం పూరిస్తామన్నారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు పనులను నిలిపేశారని, సోనియా గాంధీ తెలంగాణను సంపన్న రాష్ట్రం ఇస్తే.. ఈ రోజు అప్పులమయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు న్యాయం జరిగిందని, రంగారెడ్డి జిల్లాకు సీఎం కేసీఆర్ తీరని అన్యాయం చేశారన్నారు.