Tragedy: హైదరాబాద్లో విషాదం.. నాలుగేళ్ల కూతురికి ఉరేసి దంపతులు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: మేం చనిపోవడానికి కారణం ఆ నలుగురే. వారిని వదిలిపెట్టొద్దు’ అంటూ సూసైడ్ నోట్ రాసి నాలుగేళ్ల కుమార్తెతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని ముషీరాబాద్లో చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లా లక్ష్మీపురానికి చెందిన కొప్పుల సాయికృష్ణ(37), చిత్రకళ(30) దంపతులు. వీరికి తేజస్వి అనే నాలుగేళ్ల కూతురు ఉంది. ఏడాది నుంచి ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. సాయికృష్ణ ర్యాపిడో బైక్పై వెళ్లేవాడు. ఏడాదిగా పనికి వెళ్లడం లేదు. భార్య చిత్రకళ నాంపల్లి బిర్లా సైన్స్ సెంటర్లోని టికెట్ కౌంటర్లో పనిచేసేది. అయితే అపాయింట్మెంట్ ఆర్డర్, పే స్లిప్లు అడగడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. భర్తకు పని లేకపోవడం, అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేక చిత్రకళ తీవ్ర మనోవేదనకు గురైంది. సరైన కారణాలు చూపకుండా తనను ఉద్యోగం నుంచి తొలగించిన నలుగురు ఉద్యోగులు శ్యామ్ కోటరీ, గాథా, హరిబాబు, సంతోష్ రెడ్డిలను వదిలిపెట్టవద్దని సూసైడ్ నోట్ రాసి గోడకు అతికించింది. ముందుగా కూతురు ఉరివేసుకుని.. ఆ తర్వాత భార్య, భర్తలు కూడా ఉరివేసుకుని దారుణ హత్యకు పాల్పడ్డారు. గురువారం రాత్రి వీరి ఇంట్లో నుంచి పెద్ద శబ్ధం రావడంతో ఇరుగుపొరుగు వారు తలుపు తట్టారు. కానీ తలుపులు తీయలేదు. ఎంతకు డోర్ తీయకపోవడంతో.. అనుమానం వచ్చిన ఇంటి యజమాని శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ముగ్గురు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు.
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
బిర్లా సైన్స్ సెంటర్లో అనేక అవకతవకలు జరిగాయని, వాటి గురించి తనకు తెలిసి శ్యామ్ కొఠారి, గీతారావు, హరిబాబు, సంతోష్ రెడ్డిలపై తప్పుడు కేసులు పెట్టి ఉద్యోగం నుంచి తొలగించారని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. రూ.కోటి మోసం చేశారని 12 పాయింట్లతో సూసైడ్ నోట్ రాసి గోడకు అతికించారు. ఓ.. మంత్రితో మాట్లాడేందుకు ప్రయత్నించినా కుదరలేదు. అంతే కాకుండా ఓ.. టీవీ ఛానల్ వారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది కానీ స్పందించలేదని తెలిపారు. అయితే ఆఫీస్లో ఏం జరిగివుంటే.. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Miss Universe 2023: మిస్ యూనివర్స్ పోటీలు.. నేషనల్ కాస్ట్యూమ్స్ డేలో ఆకట్టుకున్న శ్వేతా శార్దా
తాజావార్తలు
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!