Tragedy: హైదరాబాద్లో విషాదం.. నాలుగేళ్ల కూతురికి ఉరేసి దంపతులు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: మేం చనిపోవడానికి కారణం ఆ నలుగురే. వారిని వదిలిపెట్టొద్దు’ అంటూ సూసైడ్ నోట్ రాసి నాలుగేళ్ల కుమార్తెతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని ముషీరాబాద్లో చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లా లక్ష్మీపురానికి చెందిన కొప్పుల సాయికృష్ణ(37), చిత్రకళ(30) దంపతులు. వీరికి తేజస్వి అనే నాలుగేళ్ల కూతురు ఉంది. ఏడాది నుంచి ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. సాయికృష్ణ ర్యాపిడో బైక్పై వెళ్లేవాడు. ఏడాదిగా పనికి వెళ్లడం లేదు. భార్య చిత్రకళ నాంపల్లి బిర్లా సైన్స్ సెంటర్లోని టికెట్ కౌంటర్లో పనిచేసేది. అయితే అపాయింట్మెంట్ ఆర్డర్, పే స్లిప్లు అడగడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. భర్తకు పని లేకపోవడం, అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేక చిత్రకళ తీవ్ర మనోవేదనకు గురైంది. సరైన కారణాలు చూపకుండా తనను ఉద్యోగం నుంచి తొలగించిన నలుగురు ఉద్యోగులు శ్యామ్ కోటరీ, గాథా, హరిబాబు, సంతోష్ రెడ్డిలను వదిలిపెట్టవద్దని సూసైడ్ నోట్ రాసి గోడకు అతికించింది. ముందుగా కూతురు ఉరివేసుకుని.. ఆ తర్వాత భార్య, భర్తలు కూడా ఉరివేసుకుని దారుణ హత్యకు పాల్పడ్డారు. గురువారం రాత్రి వీరి ఇంట్లో నుంచి పెద్ద శబ్ధం రావడంతో ఇరుగుపొరుగు వారు తలుపు తట్టారు. కానీ తలుపులు తీయలేదు. ఎంతకు డోర్ తీయకపోవడంతో.. అనుమానం వచ్చిన ఇంటి యజమాని శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ముగ్గురు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు.
Also Read
బిర్లా సైన్స్ సెంటర్లో అనేక అవకతవకలు జరిగాయని, వాటి గురించి తనకు తెలిసి శ్యామ్ కొఠారి, గీతారావు, హరిబాబు, సంతోష్ రెడ్డిలపై తప్పుడు కేసులు పెట్టి ఉద్యోగం నుంచి తొలగించారని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. రూ.కోటి మోసం చేశారని 12 పాయింట్లతో సూసైడ్ నోట్ రాసి గోడకు అతికించారు. ఓ.. మంత్రితో మాట్లాడేందుకు ప్రయత్నించినా కుదరలేదు. అంతే కాకుండా ఓ.. టీవీ ఛానల్ వారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది కానీ స్పందించలేదని తెలిపారు. అయితే ఆఫీస్లో ఏం జరిగివుంటే.. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Miss Universe 2023: మిస్ యూనివర్స్ పోటీలు.. నేషనల్ కాస్ట్యూమ్స్ డేలో ఆకట్టుకున్న శ్వేతా శార్దా
తాజావార్తలు
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!