Fake Baba: వేములవాడలో ఫేక్ బాబా.. దేశ గురువు పేరుతో గుర్రంపై స్వారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Baba in Vemulawada: మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాళ్లకు కొదవలేదు. ఈజీగా మనీ సంపాదించేందుకు మోసాలకు తెగబడుతుంటారు. మూఢ నమ్మకాలతో ప్రజలను మోసం చేస్తూ అందినకాటికి దోచేస్తుంటారు. ఈ కాలంలో కూడా ఇలాంటి వారిని నమ్మేవారు ఉన్నారంటే అది ప్రజల మూర్ఖత్వమే అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వారిని నమ్మవద్దని పోలీసులు, అధికారులు చెబుతున్నా అవన్నీ పక్కన పెట్టి మోసపోయి లబోదిబో మంటూ మళ్లీ పోలీసుల వద్దకే సహాయం కోసం వస్తుంటారు. అధికారులు ఎంత అలర్ట్ గా ఉండాలని చెప్పిన ప్రజలు మాత్రం ఇలాంటి నకిలీ బాబాలను నమ్మి మోసపోతుంటారు. ఇలాంటి వారిని వద్ద నుంచి డబ్బులు దండుకునేందుకు ఏకంగా ఒక వ్యక్తి దేశగురువు అవతారమెత్తి తనను తాను బాబాగా చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. ప్రత్యేక పూజల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నాడు.
దేశ గురువు పేరుతో గుర్రంపై స్వారీ చేస్తూ గ్రామాల్లో పర్యటిస్తున్న వ్యవహారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలాల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లో డప్పు చాటింపు వేయించి మరి ఇంటింటికి తిరుగుతూ పూజల పేరుతో ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంటికి వచ్చి కొబ్బరికాయ కొడతాడని ఇందులో నచ్చినంత కట్నం వేసుకోవాలని చెబుతున్న దోషాల పేరుతో ప్రజలను బాబా భయపట్టిస్తున్నాడని ఆరోపణ వస్తున్నాయి. దీంతో 500 నుండి 5వేల రూపాయల వరకు పూజల పేరుతో వసూళ్లకు పాల్పడుతుండగా సామాన్య ప్రజలు విలవిలలాడుతున్నారు. అయితే ఈ బాబా వ్యవహారంపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
దీంతో ఎస్.ఐ.నాగరాజు స్పందిస్తూ బురిడీ బాబాను నమ్మవద్దని ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు. బలవంతపు వసూళ్లకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రూరల్ మండలంలోని అనేక గ్రామాల్లో తిరిగిన బాబా వేలాది రూపాయలు ప్రజల నుండి అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దొంగ బాబాను అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు గురువులమని చెప్పుకుని బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని.. పూజల పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు.
Kerala: రేయ్ నువ్వు భర్తేనా.. నీప్రెండ్ తో గడపలేదని భార్యనే చంపేస్తావా?
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!