Site icon NTV Telugu

Heat Waves: తెలంగాణలో పెరుగుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

Tg

Tg

Heat Waves: తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రోజు రోజుకు ఎండల తీవ్రత భారీగా పెరుగుతుంది. ఇక, ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కోమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో రెడ్ అలెర్ట్ ఉన్న జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Read Also: Anushka : ‘ ఘాటి’ ప్రాజెక్ట్ నుండి కూడా క్రిష్ త‌ప్పుకున్నాడా.. ?

అయితే, రెడ్ అలెర్ట్ జారీ చేసిన తొమ్మిది జిల్లాలకు మినహా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. పెరుగుతున్న రాత్రి పూట ఉష్ణోగ్రతలతో తీవ్ర ఉక్కపోత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడ గాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొనింది. ఇక, వడ దెబ్బ ప్రభావంతో మరణాలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది అని హెచ్చరించారు. కాబట్టి అవసరం ఉంటేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు.

Exit mobile version