UPSC Civils: కొనసాగుతున్న యూపీఎస్సీ సివిల్స్ 2024 ప్రాథమిక పరీక్ష..!
- నేడు యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష
- పరీక్షకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి
- దేశవ్యాప్తంగా 80 నగరాల్లో నిర్వహించనున్నారు
- యూపీఎస్సీ పరీక్షను పకడ్బందీగా ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPSC Civils: యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నేడు నిర్వహించనున్నారు. ప్రస్తుతం పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా 80 నగరాల్లో ఈ పరీక్షను ఈరోజు నిర్వహించనున్నారు. ఇటీవల నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల నిర్వహణపై దేశవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ప్రతిష్టాత్మక యూపీఎస్సీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా పరీక్షా కేంద్రాల గేట్లను 30 నిమిషాల ముందే మూసివేయాలని యూపీఎస్సీ నిర్ణయించింది. వీటితోపాటు పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, జామర్లు కూడా ఏర్పాటు చేశారు. ‘నో ఐడీ… నో ఎంట్రీ’ విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా హాల్ టికెట్, ఎలాంటి గుర్తింపు కార్డు లేని వారిని పరీక్ష హాలులోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. కాబట్టి, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఐడి కార్డులను తమ వెంట తీసుకెళ్లాలి.
Read also: Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 24 మందికి గాయాలు
Also Read
- Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
- Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
అలాగే ఈ ఏడాది మొత్తం 1056 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 40 పోస్టులు వికలాంగులకు మాత్రమే కేటాయించారు. వ్రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. యూపీఎస్సీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. పేపర్ 1 ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు జరుగుతాయి. రెండు పేపర్ల పరీక్షకు 30 నిమిషాల ముందు గేట్లు మూసివేయబడతాయి. పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత గేట్లు మూసేస్తారు. అంటే ఉదయం 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. పరీక్షా కేంద్రంలోకి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. హాల్టికెట్లో ఫోటో చెల్లుబాటు కాని వారు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలి. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతో పాటు హాల్ టికెట్తో పరీక్షకు హాజరు కావాలి.
Alcohol Drinking: మద్యం ఎక్కువగా తాగటం వల్ల సె** సామర్థ్యం తగ్గుతుందా?
తాజావార్తలు
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
-
Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్గా మారిన యువకుడు!
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!