UPSC Civils: కొనసాగుతున్న యూపీఎస్సీ సివిల్స్ 2024 ప్రాథమిక పరీక్ష..!
- నేడు యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష
- పరీక్షకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి
- దేశవ్యాప్తంగా 80 నగరాల్లో నిర్వహించనున్నారు
- యూపీఎస్సీ పరీక్షను పకడ్బందీగా ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPSC Civils: యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నేడు నిర్వహించనున్నారు. ప్రస్తుతం పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా 80 నగరాల్లో ఈ పరీక్షను ఈరోజు నిర్వహించనున్నారు. ఇటీవల నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల నిర్వహణపై దేశవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ప్రతిష్టాత్మక యూపీఎస్సీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా పరీక్షా కేంద్రాల గేట్లను 30 నిమిషాల ముందే మూసివేయాలని యూపీఎస్సీ నిర్ణయించింది. వీటితోపాటు పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, జామర్లు కూడా ఏర్పాటు చేశారు. ‘నో ఐడీ… నో ఎంట్రీ’ విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా హాల్ టికెట్, ఎలాంటి గుర్తింపు కార్డు లేని వారిని పరీక్ష హాలులోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. కాబట్టి, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఐడి కార్డులను తమ వెంట తీసుకెళ్లాలి.
Read also: Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 24 మందికి గాయాలు
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
అలాగే ఈ ఏడాది మొత్తం 1056 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 40 పోస్టులు వికలాంగులకు మాత్రమే కేటాయించారు. వ్రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. యూపీఎస్సీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. పేపర్ 1 ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు జరుగుతాయి. రెండు పేపర్ల పరీక్షకు 30 నిమిషాల ముందు గేట్లు మూసివేయబడతాయి. పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత గేట్లు మూసేస్తారు. అంటే ఉదయం 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. పరీక్షా కేంద్రంలోకి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. హాల్టికెట్లో ఫోటో చెల్లుబాటు కాని వారు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలి. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతో పాటు హాల్ టికెట్తో పరీక్షకు హాజరు కావాలి.
Alcohol Drinking: మద్యం ఎక్కువగా తాగటం వల్ల సె** సామర్థ్యం తగ్గుతుందా?
తాజావార్తలు
-
Jananayagan : జననాయకుడు కోసం ఆంధ్ర, నైజాంలో విచ్చలవిడిగా థియేటర్స్, షోస్ పరిచేసారు
-
IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
-
Rohit-Kohli: ఏంటి తమాషానా.. అభిమానులు ఊరుకుంటారా.. స్టేడియం పైకప్పే లేచిపోతుంది!
-
CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
-
Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!