Engineering Student: గంజాయికి బానిసైన యువకుడు.. రైలు కిందపడి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Engineering Student: రైలు కిందపడి ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో సంచలనం రేపింది. గంజాయికి బానిసై మానేయడం కష్టమని భావించి చివరికి తన ప్రాణాలను తీసుకున్నాడు. నారపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విజయకుమార్ బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బీబీనగర్ నుంచి సనత్నగర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు నుంచి పడిఆత్మహత్య చేసుకున్నాడు. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాల ఆధారంగా విజయకుమార్ గా గుర్తించారు పోలీసులు. వెంటనే తాను చదువుతున్న కళాశాల యాజమాన్యానికి, పెద్ద చర్లపల్లిలోని తండ్రి శ్రీనివాస్ కు సమాచారం అందించాడు. ఘట్కేసర్లోని ఓ కళాశాలలో డిప్లొమా చదువుతున్న సమయంలో విజయ్కుమార్ గంజాయికి బానిసైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మరో ఇంజినీరింగ్ కళాశాలలో చేర్పించడంతో వ్యసనానికి బానిసయ్యాడని తండ్రి శ్రీనివాస్ తెలిపారు. ఫస్టియర్ లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో చదువు మానేసి చర్లపల్లిలో చికెన్ సెంటర్ ప్రారంభించాడు.
Read also: Ambati Rayudu Quits YSRCP: బ్రేకింగ్: వైసీపీకి అంబటి రాయుడు గుడ్బై..
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
విజయ్కుమార్ మానసిక క్షోభకు గురై సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోలేదు.. కానీ చదువుకుంటానని విజయకుమార్ తల్లిదండ్రులకు చెప్పడంతో.. నార్లపల్లిలోని ఉన్నత పాఠశాలలో చేర్పించి అక్కడే హాస్టల్లో జాయిన్ చేశారు. కొన్ని నెలలుగా బాగోలేదని తల్లిదండ్రులు చెప్పడంతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు. అయితే కొడుకు ఆత్మహత్య చేసుకోవద్దని తండ్రి ధైర్యం చెప్పాడు. అప్పుడు సరే అంటూ తల ఊపిన కొడుకు అన్నంతపని చేస్తాడని ఊహించలేని తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. అయితే విజయకుమార్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల గంజాయి రవాణాపై పోలీసులు నిఘా పెంచడంతో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఆ క్రమంలో గంజాయి దొరకకపోవడంతో మానసిక ఒత్తిడికి గురైన విజయ్కుమార్ రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. యువత గంజాయి, డ్రగ్స్కు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Guntur Kaaram: బాబుతో అట్లుంటది మరి.. విడుదలకు ముందే ‘గుంటూరు కారం’ సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
China Robot: చైనా రోబోలు.. భారత్కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
-
Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి అడ్డంకులు?
-
Meenakshi Natarajan: “మేము జోక్యం చేసుకోలేం”.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!