Engineering Student: గంజాయికి బానిసైన యువకుడు.. రైలు కిందపడి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Engineering Student: రైలు కిందపడి ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో సంచలనం రేపింది. గంజాయికి బానిసై మానేయడం కష్టమని భావించి చివరికి తన ప్రాణాలను తీసుకున్నాడు. నారపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విజయకుమార్ బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బీబీనగర్ నుంచి సనత్నగర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు నుంచి పడిఆత్మహత్య చేసుకున్నాడు. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాల ఆధారంగా విజయకుమార్ గా గుర్తించారు పోలీసులు. వెంటనే తాను చదువుతున్న కళాశాల యాజమాన్యానికి, పెద్ద చర్లపల్లిలోని తండ్రి శ్రీనివాస్ కు సమాచారం అందించాడు. ఘట్కేసర్లోని ఓ కళాశాలలో డిప్లొమా చదువుతున్న సమయంలో విజయ్కుమార్ గంజాయికి బానిసైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మరో ఇంజినీరింగ్ కళాశాలలో చేర్పించడంతో వ్యసనానికి బానిసయ్యాడని తండ్రి శ్రీనివాస్ తెలిపారు. ఫస్టియర్ లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో చదువు మానేసి చర్లపల్లిలో చికెన్ సెంటర్ ప్రారంభించాడు.
Read also: Ambati Rayudu Quits YSRCP: బ్రేకింగ్: వైసీపీకి అంబటి రాయుడు గుడ్బై..
Also Read
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
విజయ్కుమార్ మానసిక క్షోభకు గురై సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోలేదు.. కానీ చదువుకుంటానని విజయకుమార్ తల్లిదండ్రులకు చెప్పడంతో.. నార్లపల్లిలోని ఉన్నత పాఠశాలలో చేర్పించి అక్కడే హాస్టల్లో జాయిన్ చేశారు. కొన్ని నెలలుగా బాగోలేదని తల్లిదండ్రులు చెప్పడంతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు. అయితే కొడుకు ఆత్మహత్య చేసుకోవద్దని తండ్రి ధైర్యం చెప్పాడు. అప్పుడు సరే అంటూ తల ఊపిన కొడుకు అన్నంతపని చేస్తాడని ఊహించలేని తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. అయితే విజయకుమార్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల గంజాయి రవాణాపై పోలీసులు నిఘా పెంచడంతో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఆ క్రమంలో గంజాయి దొరకకపోవడంతో మానసిక ఒత్తిడికి గురైన విజయ్కుమార్ రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. యువత గంజాయి, డ్రగ్స్కు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Guntur Kaaram: బాబుతో అట్లుంటది మరి.. విడుదలకు ముందే ‘గుంటూరు కారం’ సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Milk: ఈ 8 ఆహారాలను పాలతో కలిపి తీసుకుంటే రిస్క్లో పడ్డట్లే..
-
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్
-
Tamil Nadu: గవర్నర్ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
-
Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..