Old City: మహిళపై కుక్కల దాడి.. పాతబస్తీలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై కుక్కలు దాడి చేశాయి. పాతబస్తీలోని యాకుత్ పుర మదీనా కాలనీలో ఓ యువకుడు పదుల సంఖ్యలో కుక్కల సాకుతున్నాడు. వాటిని రోెడ్లపై వదులుతుండటంతో.. అవి పాదచారులపై దాడి చేస్తున్నాయి.
మదీనా కాలనీ నుంచి నడుచుకుంటూ వెలుతున్న ఒక ముస్లీమ్ మహిళపై కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేశాయి. గమనించిన స్థానికులు వాటిని తరిమిన వారి మీద కూడా దాడిచేసాయి. విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించిన మహిళ చేతికి పట్టుకుని ఓసునకం ఘోరంగా దాడి చేయడంతో.. ఆ మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృష్యాలు సీసీ ఫోటేజీలో రికార్డు కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ ఫోటేజ్ చూసిన స్థానికులు నిర్థాంతపోయారు. ఈ విషయాన్ని కుక్కల యజమానికి చెప్పిన పట్టించుకోలేదు.
Also Read
- Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
- TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
- OTR: టీఆర్ఎస్ పేరు చుట్టూ కొత్త వివాదాలు..తెలంగాణ రక్షణసేన పేరుకు ఈసీ బ్రేక్స్
- OTR: ఉమ్మడి నల్గొండ పరిధిలోకి అడుగుపెట్టని బీఆర్ఎస్ అగ్రనేతలు...అసలు కారణాలేంటి ?
దీంతో కాలనీ వాసులు మాట్లాడుతూ.. పాదచారులపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్నాయని, వారికి భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయని వాపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే మదీనా కాలనీ ప్రజలు బెంబేలెత్తు తున్నామని తెలిపారు. కుక్కలు.. పిల్లలపై దాడి చేస్తే దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బయటకు అడుగు పెట్టాలంటేనే భయంగా వుందని, కుక్కల యజమానికి చెప్పిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కుక్కలను వేరే ప్రాంతానికి మార్చాలని కోరతున్నారు. దీనిపై పోలీసులకు ప్రశ్నించగా దీనిపై ఎటువంటి సమాచారం లేదని, వారికి అసలు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని స్థానిక పోలీసులు అంటున్నారు.
Tamota Prices: వామ్మో.. రూ.100 దాటిన టమోటా ధర
వీధి కుక్కల దాడిలో అభంశుభం తెలియని ఓ చిన్నారి ప్రాణాలను విడిచిన ఘటన 2022 ఏప్రిల్ 27న గోల్కొండ లో చోటుచేసుకుంది. గోల్కొండ బడాబజార్ లో ఓ కుటుంబం నివాసముంటోంది. ఈ కుటుంబానికి చెందిన రెండేళ్ల బాలుడు అనస్ అహ్మద్ ఇంటిబయట ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధికుక్కలు దాడిచేసాయి. దాంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తల్లిదండ్రులు బాలున్ని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్య లోనే మృతిచెందాడు.. వైద్యులు పరిసిలించి బాలుడు మృతి చెందినట్లు తెలిపారు.
కుక్కలు స్వైరవిహారం చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని, అందుకే కుక్కల దాడిలో రోజు రొజుకోరు ప్రాణాలను కొల్పొతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోకుండా ఉంటే మరింత మందిపై కుక్కలు దాడిచేస్తాయని, కుక్కలతో వారికి ప్రమాదం ఉందని వాపొతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలపైనే జిహెచ్ఎంసి, ప్రభుత్వం దృష్టి పెట్టిందని మిగిలిన ప్రాంతాల ను కనీసం పట్టించుకోకుండా ఉందని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ కుక్కల సమస్యపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
-
Dhanush: మరోసారి త్యాగం చేయనున్న ధనుష్?.. రజనీకాంత్ ‘జైలర్ 2’ కోసం ‘ఓం’ వాయిదా పడుతుందా?
-
Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
-
Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!