టాలీవుడ్లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది.. దర్శకుడు పైడి రమేష్ మృతిచెందారు.. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్ ఎలెన్ నగర్లో ఓ భవనం పై నుంచి జారిపడి ఆయన కన్నుమూశారు.. భవనం నాలుగో అంతస్తులో బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ మూలంగా షాక్ కొట్టడంతో.. ఆయన ప్రమాదవశాత్తు జారిపడినట్టుగా చెబుతున్నారు.
Read Also: KTR : కేంద్రమంత్రిపై ట్విట్టస్త్రాలు సంధించిన కేటీఆర్..
నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు పైడి రమేష్.. ఇక, విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. ఘటనా స్థలానికి వెళ్లారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, పైడి రమేష్ దర్శకత్వంలో ‘రూల్’ అనే సినిమా తెరకెక్కింది. 2018లో విడుదలైన ఈ సినిమా అంతగా నడవకపోయినా.. మరో సినిమా ప్రయత్నాల్లో ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ ఇలా మృతిచెందడం.. టాలీవుడ్లో విషాదాన్ని నింపింది.
