DCP Rohini Priyadarshini: నా సర్వీస్ లో ఇలాంటి మహిళలను చూడలేదు.. డీసీపీ రోహిణీ
DCP Rohini Priyadarshini: తల్లీ కూతుళ్ల ధైర్యసాహసాలకు జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడిన దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్న వారి పోరాట పటిమ అభినందనీయం. హైదరాబాద్ బేగంపేటలోని పైగా కాలనీలో ఇద్దరు దొంగలను సమర్థవంతంగా ఎదుర్కొని తరిమికొట్టిన తల్లీకూతుళ్లను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా డీసీపీ రోహిణి మాట్లాడుతూ దొంగలను పట్టుకునేందుకు అమిత్ మహోత్, ఆమె మైనర్ కూతురు చేసిన కృషి అభినందనీయమన్నారు. కాలనీలో నిన్న మధ్యాహ్నం దోపిడీ యత్నం జరిగింది.
Read also: Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్.. ట్రెండింగ్లోకి వచ్చిన సత్యపాల్ మాలిక్
Also Read
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
నిందితులు హత్య చేసేందుకు ప్రయత్నించారు. 2022లో దీపావళి సమయంలో తమ ఇంటికి పనికి వచ్చారు. నాలుగు రోజులు పనిచేశారు. ఇద్దరు నిందితులు దోపిడీకి ప్లాన్తో వచ్చారు. రెండు రోజుల క్రితమే రేకి చేశారు. కొరియర్ వచ్చిందని చెప్పి ఇంట్లోకి వచ్చారు. కంట్రీ మేడ్ వెపన్, కత్తితో బెదిరించారు. నిందితుడిని పట్టుకునేందుకు తల్లీ కూతుళ్లు సాహసం చేశారు. నా పదకొండేళ్ల సర్వీసులో ఇంత ధైర్యం చూపిన మహిళలను చూడలేదు. ఇక్కడ ఒక నిందితుడు పట్టుబడ్డాడు. మరో నిందితుడిని కాజీపేటలో జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. ఆయుధాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. గతంలో ఏమైనా కేసులు ఉంటే దర్యాప్తు చేస్తున్నామన్నారు. మహిళలు కూడా ఆత్మరక్షణ నేర్చుకోవాలని డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు.
Read also: K.Kavitha: బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లండి.. సుప్రీమ్ కోర్టులో కవితకు ఎదురు దెబ్బ..!
కాగా.. గురువారం మధ్యాహ్నం బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. రసూల్పుర జైన్ కాలనీ లోని ఓ ఇంట్లో నవరతన్ జైన్ కుటుంబం నివాసం ఉంటోంది. గురువారం మధ్యాహ్నం కాలనీ లోని వారు ఉన్న ఇంటికి కొరియర్ డెలివరీ బాయ్ వచ్చారు. కాకపోతే ఆ సమయంలో నవరతన్ జైన్ ఇంట్లో లేకపోవడంతో.. భార్య అమిత మేహోత్, కుమార్తె, పనిమనుషులు మాత్రమే ఉన్నారు. ఇక మొదటగా ఆ సమయంలో మధ్యాహ్నం 2 :15 గంటల సమయంలో ఇద్దరు యువకులు నేరుగా కొరియర్ అంటూ ప్రధాన గేటు నుంచి లోపలకు వచ్చారు. అయితే వారిని గుమ్మం బయటే ఉండాలని అమిత సూచిస్తుండగానే వచ్చిన ఇద్దరిలో ఒకరు నేరుగా ఇంట్లోకి చొరబడిన వారిని తల్లికూతుర్లు ఎదుర్కొన్న సాహస ఘటన తెలిసిందే..
MS Dhoni: ఐపీఎల్లో ధోని ఆడటంపై అనుమానాలు.. సీఎస్కే ఏం చెప్పిందంటే..?
తాజావార్తలు
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!