TS Covid Cases: విజృంభిస్తున్న మహమ్మారి.. తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Covid Cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లో మళ్ళీ భయం మొదలైంది. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ వచ్చిన శాంపిల్స్ నీ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పుణె పంపుతున్నారు. త్వరలో గాంధీ ఆసుపత్రిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రారంభించనుంది. ఇప్పటికే చలి తీవ్రత తో శ్వాస సమస్యల కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా కూడా సీరియస్ గా ఎవ్వరూ లేకపోవడం.. అంతా స్టేబుల్ గా ఉన్నారు. అయితే ఇదే సీజన్ లో ఎక్కువగా ఆస్తమా, COPD, కేసులు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ప్రజలు జలుబు, ఆస్తమాకు చాలా లైట్ తీసుకుంటున్నారు. దీంతో ఆసుపత్రులకు వెళ్లే వారికి ప్రతి ఒక్కరిని కోవిడ్ పరీక్షలకు నిర్వహిస్తున్నారు.
Read also: Aadudam Andhra: గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం: సీఎం జగన్
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
అలా ఏమైనా కోవిడ్ గా గుర్తించబడితే.. వారిని ఐసోలేషన్ వార్డ్ కు పంపుతామని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు. మెడిసిన్స్, పరికరాలతో సిద్ధంగా ఉన్నాయని అన్నారు. చెస్ట్ హాస్పిటల్ లో వైద్యులు , సిబ్బంది సన్నద్ధంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. కాగా.. రాష్ట్రంలో మొత్తం 55 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైద్రాబాద్ జిల్లాలో 45 కేసులు నమోదయ్యాయి.. రంగారెడ్డి -3, సంగారెడ్డి-2, ఖమ్మం- 1, కరీంనగర్- 1, వరంగల్ -2, మెదక్ -1 గుర్తించారు అధికారులు. ఇక హైద్రాబాద్ లో ఉన్న పాజిటివ్ కేసుల్లో.. ఫీవర్ ఆస్పత్రి లో 5 పాజిటివ్ కేసులు కాగా.. చెస్ట్ హాస్పిటల్ లో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక నిలోఫర్ లో 2, మిగితా కేసులు గాంధీ ఆస్పత్రి తో పాటు ఇతర ఆస్పత్రుల్లో ఉన్నాయని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి లో 10 పాజిటివ్ కేసులు కాగా.. అందులో 8 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఒకరు అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ లో ఉన్నారు. మరొకరు మృతి చెందడంతో తొలి కరోనా మరణకేసుగా నమోదు అయ్యిందని వైద్యులు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా వాడాలని సూచించారు.
Corona : గత 24 గంటల్లో దేశంలో 412కొత్త కరోనా కేసులు.. మూడు మరణాలు
తాజావార్తలు
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!