Coronavirus: తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. అంతకంతకు పాజిటివ్ కసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు కొత్త వెరియంట్తో భయం అవసరం లేదని నిపుణులు చెబుతున్నా.. కోవిడ్ మరణాలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో తాజాగా రాష్ట్రంలో ఎనిమిది కొవిడ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
Also Read: Sunburn Event Cancel: హైదరాబాద్లో సన్బర్న్ ఈవెంట్ రద్దు.. నిర్వాహకుడు సుశాంత్పై కేసు
తాజా కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,44,566కి పెరిగింది. కొత్తగా నలుగురు కోలుకోగా.. ఇప్పటి వరకు 8,40,396 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 59 మంది కొవిడ్కు చికిత్స పొందుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇవాళ 1,333 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, మరో 30 మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది.
Also Read: PM Modi: సరికొత్త రికార్డును సృష్టించిన ప్రధాని మోడీ..