Jana Reddy: యశోద ఆస్పత్రిలో చేరిన జానారెడ్డి.. స్టంట్ వేసిన వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
congress senior leader jana reddy admitted in yashoda hospital: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి యశోద ఆస్పత్రిలో చేరారు. వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. జానారెడ్డి మంగళవారం మోకాలి చికిత్స కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. మోకాలికి చికిత్స సమయంలో వివిధ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో జానా రెడ్డి గుండె రక్తనాళాల్లో ఒకటి మూసుకుపోయినట్లు తేలిందని వైద్యులు తెలిపారు. జానారెడ్డికి నిన్న రాత్రి వైద్యులు స్టంట్ చేశారు. ప్రస్తుతం జానారెడ్డి ఆరోగ్యం నిలకగా ఉందని భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విశ్రాంతి అవసరమని తెలిపారు. ఆరోగ్యం పట్ల భయపడవలసిన పరిస్థితి లేదని పేర్కొన్నారు. జానారెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు భయాందోలనకు గురయ్యారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు కుటుంబ సభ్యులు.
Read also: SSC Paper Leak : బండితో మాట్లాడింది 40 సెకెండ్లే.. ఏ2 నిందితుడు కీలక వ్యాఖ్యలు
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
- Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయాలంటూ ఇటీవల హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో జానా రెడ్డి పాల్గొన్నారు. జానా రెడ్డి సీఎం పదవి మినహా అన్ని రకాల మంత్రి పదవులు చేపట్టారు. 2018 ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య చేతిలో జానా రెడ్డి ఓటమి పాలయ్యారు. నోముల నరసింహయ్య మరణం తర్వాత నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో జానా రెడ్డి పోటీ చేశారు. నోముల నరసింహయ్య కుమారుడు భగత్ చేతిలో జానారెడ్డి ఓటమి పాలయ్యారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత జానారెడ్డి మునుపటిలా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. పార్టీ కీలక నేతలు వచ్చినప్పుడు నిర్వహించే సమావేశాలకు హాజరవుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జానా రెడ్డి తనయుడు పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే మిర్యాలగూడ, నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాల్లో జానా రెడ్డి, ఆయన కుమారుడు పోటీ చేసే అవకాశం లేకపోలేదు.
Fenugreek Water: మెంతి నీటితో బరువు తగ్గుతారా..! ఎలా?
తాజావార్తలు
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
-
Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
-
Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
-
Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!