Premsagar Rao: ఇందిరమ్మ ఇండ్లు తప్ప కేసీఆర్ కొత్తగా ఇచ్చిన ఇండ్లేమి లేవు
Premsagar Rao: ఇందిరమ్మ ఇండ్లు తప్ప కెసిఆర్ కొత్తగా ఇచ్చిన ఇండ్లేమి లేవని ప్రజలే చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కమిటి చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ స్ట్రాటజీ కమిటీ మూడోవ సమావేశం జరుపుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహాల రిపోర్టు వచ్చే వారం ఠాక్రే కు అందిస్తామన్నారు. ప్రతిపక్షాల వ్యూహాలకు దీటుగా మా వ్యూహాలు ఉంటాయని అన్నారు. తప్పకుండా మా భాధ్యత నెరవేరుస్తామన్నారు. తెలంగాణలో తూఫాన్లా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోందన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పార్టీ హాయంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు కాంగ్రెస్ పార్టీ హాయంలోనే ఉన్నాయన్నారు. ప్రస్తుతం వడ్ల కొనుగోలులో పెద్ద స్కాం జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళల సాధికారత పూర్తిగా కుంటు పడిందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు తప్ప కేసీఆర్ కొత్తగా ఇచ్చిన ఇండ్లేమి లేవని ప్రజలే చెబుతున్నారని అన్నారు. కేసీఆర్ బంధులన్ని ఆగిపోయాయని తెలిపారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. 75 నుంచి 80 సీట్లు సాధిస్తామన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలకు ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తుందన్నారు. రైతులకు పెద్ద పీట వేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాష్ట్రంలో 22 లక్షల కౌలు రైతులు ఉన్నారని, కేసీఆర్ ప్రభుత్వంలో కౌలు రైతులు మోసపోయారన్నారు. తెలంగాణలో 54 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయని తెలిపారు.
కోటి ఎనభై లక్షల మంది పని చేసుకొని బతుకున్నారని అన్నారు. కేసీఆర్ వచ్చాక అందరూ రోడ్డున పడ్డారని అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలిపారు. దరిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా అందిస్తామన్నారు. డిసెంబర్ 10 లోపల పోలింగ్ పూర్తి అవుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో కూని అవుతున్న ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. పార్టీ మా మీద పెద్ద భాధ్యత పెట్టిందని, మా బాధ్యతలు తప్పకుండా నిర్వర్తిస్తామన్నారు. వచ్చేవారం మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకొని రిపోర్ట్ అధిష్టానానికి అందిస్తామన్నారు. కచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామన్నారు. ప్రజల అభిప్రాయాలు తీసుకొని ప్రజలకు అవసరమయ్యే మ్యానిఫెస్టోను రూపొందిస్తామని తెలిపారు. వ్యవసాయం చేసే రైతులను ప్రగాఢంగా నడుపుతామన్నారు. డిల్లీ వర్సెస్ తెలంగాణ అనే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. పొత్తుల ద్వారా మేము కొంత దెబ్బ తిన్నాం.. ఈ సారి పక్క ప్రాణాలికతో ప్రజల్లోకి వెళతామన్నారు. అవసరం అనుకున్న వారితో మాత్రమే పొత్తులు ఉంటాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలలు విశ్వాసం కోల్పోయారని మండిపడ్డారు. కేసీఆర్ కు భయం పుట్టుకుoది.. అందుకే వరస బెట్టి సభలు నిర్వహిస్తున్నారని తెలిపారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తులు అంశం అధిష్టానం చూసుకుంటది.. చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
US White House: వైట్హౌస్లో ఆంధ్రా విద్యార్థులు సందడి.. కారణం ఇదీ..
Also Read
- Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
- TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
తాజావార్తలు
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
Bengal Election: బెంగాల్లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం!
-
Mumbai Indians Unwanted Record: ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!
-
NBK 112 : ‘బాలయ్య-కొరటాల’ మాస్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్
-
Sanju Samson: “నా విజయ రహస్యం ఇదే”.. సెంచరీ వీరుడు సంజూ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!