NTV Telugu Site icon

గిరిజన హక్కులను తెలంగాణలో కాలరాస్తున్నారు : సీతక్క

ఇందిరా భవన్ లో పోడు భూముల పోరాట కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… మనకు పోడు భూములకు హక్కులు కల్పించింది కాంగ్రెస్, కేసీఆర్ దళితులను సీఎం చేస్తా అని అన్నారు. మోసం చేశారు అన్నారు. దళిత, గిరిజనుల హక్కులను తెలంగాణ లో కాలరాస్తున్నారు. రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరిగింది. హరిత హారం పేరుతో కేసీఆర్ గిరిజనుల భూములు గుంజుకున్నారు. ఎస్డీ, ఎస్టీ లకు హక్కులు, రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గిరిజన మంత్రులను, ఎమ్మెల్యేలు లను ప్రశ్నించాలి. ఇంద్రవెల్లి వేదికగా జరుగుతున్న ఉద్యమాన్ని విజయవంతం చేయాలి. అమ్ముకోవడానికి భూములున్నాయి కానీ దళితులకు, గిరిజనులకు ఇవ్వడానికి భూములు లేవా అని అడిగిన సీతక్క పోడు భూములు రక్షించుకుందాం అని పిలుపునిచ్చారు.