Drugs : మరో పెద్ద నెట్వర్క్ను చేధించిన తెలంగాణ ఈగల్ ఫోర్స్
- ప్రజాపతిని రెడ్ హ్యాండెండ్గా అదుపులోకి తీసుకున్నారు
- హవాలా కేంద్రంలో 3 కోట్ల రూపాయల నగదును స్వాధీనం
- మరో పెద్ద మాఫియా గుట్టురట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs : డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బును హవాలా రాకెట్గా మారుస్తున్న గ్యాంగ్ను పట్టుకుంది తెలంగాణ ఈగల్ టీమ్. ముంబై కేంద్రంగా హవాలా రాకెట్ నడుపుతున్న కింగ్పిన్ను పట్టుకున్నారు. హవాలా రూపంలో నైజీరియన్ డ్రగ్ కార్టెల్స్కు డ్రగ్ మనీ పంపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ మరో పెద్ద మాఫియా గుట్టురట్టు చేసింది. ముంబై కేంద్రంగా నడుస్తున్న హవాలా నెట్వర్క్ను చేధించడమే కాకుండా… హవాలా రాకెట్ నడుపుతున్న కింగ్పిన్ను పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. నార్కోటిక్స్ కేసులో రాచకొండ పోలీసులు పట్టుకున్న ఓ నైజీరియన్ను పట్టుకుని విచారించిన ఈగల్ టీమ్… తీగ లాగితే డొంక కదిలింది. విచారణలో సంచలన విషయాలు రాబట్టిన టీమ్… ఏకంగా నెట్వర్క్కు చెక్ పెట్టింది.
Read Also : Love Story : ప్రేమ వేధింపులకు యువతి బలి
Also Read
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ నైజీరియన్ ఎసోమ్చీ కెనెత్ అలియాస్ మ్యాక్స్వెల్ అలియాస్ ఇమ్మాన్యుయెల్ బెడియాకోను ఈగల్ టీమ్కు అప్పగించారు రాచకొండ పోలీసులు. నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ను విచారించిన ఈగల్ టీమ్.. కీలక విషయాలు రాబట్టింది. ఇతడు ఇచ్చిన సమాచారంతో ముంబై వెళ్లిన తెలంగాణ ఈగల్ ఫోర్స్.. సంచలన విషయాలు కనిపెట్టింది. డ్రగ్స్ సరఫరా.. డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును హవాలా రూపంలో తరలిస్తున్నట్లు గుర్తించారు. దుర్గారం రతాజీ ప్రజాపతి అనే డ్రగ్ డీలర్… ముంబై కేంద్రంగా హవాలా నెట్వర్క్ నడుపుతున్నాడు. ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ సిటీల్లో హవాలా ఆఫీసులు ఏర్పాటు చేశాడు ప్రజాపతి. గోవా, ముంబై, ఢిల్లీలో ఉన్న ఏజెంట్లు… ఆయా సిటీల్లో ఉన్న నైజీరిఆయన్ డ్రగ్ పెడ్లర్ల ద్వారా డబ్బు సేకరించి హవాలా కేంద్రాలకు తరలిస్తారు. ఈ డబ్బు మొత్తాన్ని హవాలా రూపంలో నైజీరియాకు చేరవేస్తున్నాడు ప్రజాపతి. ఈ తతంగాన్ని అంతా గుర్తించిన తెలంగాణ ఈగల్ టీమ్.. హవాలా కేంద్రంపై రైడ్ చేసింది. ప్రజాపతిని రెడ్ హ్యాండెండ్గా అదుపులోకి తీసుకున్నారు. హవాలా కేంద్రంలో 3 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా ఏజెంట్లు… డ్రగ్ పెడ్లర్ల ద్వారా డబ్బులు సేకరించి ముంబైలోని ప్రజాపతికి పంపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ డబ్బును హవాలాగా మార్చి.. పలు మార్గాల్లో నైజీరియా చేరవేస్తున్నాడు ప్రజాపతి…
తాజావార్తలు
-
Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
-
Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
-
Air Conditioner: ఏసీని ఈ ఉష్ణోగ్రతలో పెడితే కరెంట్ బిల్లు తగ్గుతుందా? చాలామందికి తెలియని నిజాలు
-
Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
-
Prabhas : ‘స్పిరిట్’ పవర్ఫుల్ డైలాగ్ లీక్? థియేటర్స్ షేక్ అవడం గ్యారెంటీ
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!