Revanth Reddy: ధరణి సమస్యలపై రేవంత్ రెడ్డి సమీక్ష.. కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో మిగిలిన నాలుగు హామీలను కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అన్ని శాఖలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. మండల కేంద్రంలో నెలకోసారి రెవెన్యూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ధరణి పేరును భూమాతగా మారుస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖలో ఉద్యోగుల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు. ధరణి సమస్యలపై ఇప్పటికే మీడియాలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
Read also: U19 WC 2024: ఇద్దరు హైదరాబాదీ ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో చోటు!
Also Read
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
- OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను రద్దు చేసి మెరుగైన ఆదాయ సేవల కోసం ‘భూమాత’ పేరుతో పోర్టల్ను తీసుకువస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే.. భూమి హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేసేందుకు సమగ్ర భూ హక్కుల సర్వే చేపట్టి హక్కులు పునరుద్ధరిస్తామని తెలిపారు. ఆ సర్వే ద్వారా ప్రతి రైతుకు ‘భూధార్ కార్డు’ ఇస్తామని, కోనేరు రంగారావు ల్యాండ్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల భూములు, భూమి హక్కుల పరిరక్షణకు సమగ్ర రెవెన్యూ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం భూసంస్కరణల ద్వారా పేదలకు పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాల భూమిలో పేదలకు పూర్తి భూమి హక్కులు కల్పిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎవరి మధ్య భూ తగాదాలు, వివాదాలు తలెత్తకుండా పారదర్శకమైన ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే తమ ధ్యేయమని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగిస్తామని స్పష్టం చేశారు.
Hyderabad: అత్యుత్తమ నగరంగా హైదరాబాద్.. దేశంలోనే అగ్రస్థానం
తాజావార్తలు
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!