CM Revanth Reddy : వ్యవసాయం దండగ కాదు.. పండగ చేయాలి
- శిల్పకళావేదికలో సర్వేయర్లకు సర్టిఫికెట్లు, లైసెన్సులు అందజేత
- “మాకు ప్రత్యేక సైన్యం లేదు.. మీరే మా సైన్యం” : సీఎం వ్యాఖ్యలు
- ధరణి చట్టంపై సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు
- రైతు లాభపడితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే రైతులు లాభపడే విధంగా పాలన సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం శిల్పకళావేదికలో శిక్షణ పొందిన సర్వేయర్లకు సర్టిఫికెట్లు, లైసెన్సులు అందజేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ కాదు.. పండగ కావాలన్నారు. రైతు లాభపడాలి.. రైతుకు అన్యాయం చేస్తే అది మన కుటుంబ సభ్యుడికి అన్యాయం చేసినట్టే అవుతుంది అని అన్నారు.
Protest: ఇంటిని శుభ్రం చేయమంటే.. ఎంత పని చేసిందో తెలుసా….
Also Read
దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. “2047 విజన్ డాక్యుమెంట్ కోసం మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రజలను భాగస్వామ్యులను చేసేలా చట్టాలు రూపొందిస్తాం” అని చెప్పారు. “మాకు ప్రత్యేక సైన్యం లేదు.. మీరే మా సైన్యం” అని రేవంత్ అన్నారు. రాజులు యుద్ధాలు చేసినా, కొమరం భీం చేసిన సాయుధ పోరాటం కూడా భూమి కోసం, భుక్తి కోసం జరిగిందని ఆయన గుర్తుచేశారు. “కన్నతల్లి మీద ఎంత ప్రేమ చూపిస్తామో, భూమిపై కూడా అంతే ప్రేమ చూపించాలి. భూములు లాక్కోవాలని చూసిన ప్రతీసారి తిరుగుబాట్లు వచ్చాయి. ధరణి చట్టం కొద్దిమంది దొరలకు చుట్టం అయ్యింది. ధరణి దోపిడీ నుండి మొన్న జరిగిన ఎన్నికలతో ప్రజలు విముక్తి పొందారు” అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
IND-W vs ENG-W: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఈసారైనా భారత్ గెలిచేనా..?
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!