CM KCR: రాష్ట్ర, దేశ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: రంగుల పండుగ హోలీని జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారు. ఈ ఏడాది మార్చి 8న హోలీ పండుగ జరుపుకోనున్నారు. హోలీ పండుగ విషయానికొస్తే.. ఈ సంవత్సరం ఎప్పుడు జరుపుకోవాలో అనే సందిగ్ధత ఏర్పడింది, అయితే మంగళవారం సాయంత్రం కామ దహనం చేయాలి, బుధవారం హోలీ పండుగ జరుపుకోవాలి. అయితే చాలా మంది రెండు రోజులూ హోలీని జరుపుకుంటారు. ఈనేపథ్యంలో హోలీ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించింది. ఇదిలావుండగా, పచ్చని మొగ్గతో పునరుజ్జీవింపబడి, కొత్త మార్గంలో పునఃప్రారంభమయ్యే ప్రకృతి చక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి కొత్తదనాన్ని హోలీ రూపంలో స్వాగతించే భారతీయ సంప్రదాయం ఎంతో అందంగా ఉంటుందని అన్నారు.
Read also: Attack on Petrol Bunk: ఇదెక్కడి ఘోరం.. బైక్ లో పెట్రోల్ పోసి డబ్బులు అడిగినందుకు చంపేశారు
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఈసందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర, దేశ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.హోలీ నేపథ్యంలో చిన్నారుల జాజిరీలు, వెన్నెల నవరాత్రుల కోలాటాల చప్పట్లతో పల్లెలు హోరెత్తుతాయని చెప్పారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా కేరింతలు కొట్టి జరుపుకునే హోలీ మానవ జీవితం ఒక వేడుకగా భావించి ప్రకృతితో మమేకమై జీవించే తత్వాన్ని ఇస్తుందని అన్నారు. ప్రజలంతా భిన్నాభిప్రాయాలు పక్కనపెట్టి బంతిపూల వంటి సహజ రంగులతో హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని, పరస్పర ప్రేమ, ఆప్యాయతలను చాటుకోవాలని ఆయన కోరారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ప్రగతి కార్యాచరణ తెలంగాణలోని దళిత, బహుజన, సకలజనుల జీవితాల్లో నింపిందని అన్నారు. దేశంలోని ప్రజలందరి జీవితాల్లో కొత్త జీవితం వెల్లివిరిసే వరకు తమ కృషి కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తగు జాత్ర్తలు పాటిస్తూ హోలీ జరుపుకోవాలని, రంగులు కళ్లల్లో పడకుండా, పిల్లలకు పెద్దలు దగ్గర ఉండి జాగ్రత్తలు చప్పాలని సీఎం కేసీఆర్ సూచించారు.
Bandi sanjay: తెలంగాణ భవిష్యత్తును మార్చేందుకే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!