Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Kcr Speech After Brs Party Announcement

CM KCR: సీఎంగా ఉంటూనే.. దేశమంతా పర్యటిస్తా

Published Date :October 5, 2022 , 9:35 pm
By NTV WebDesk
CM KCR: సీఎంగా ఉంటూనే.. దేశమంతా పర్యటిస్తా
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM KCR Speech After BRS Party Announcement: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సీఎం కేసీఆర్ దూరం అవ్వొచ్చన్న అనుమానాలు ఉండేవి. అయితే.. ఇప్పుడు అలాంటి అనుమానాలు ఏమాత్రం అవసరం లేదు. ఎందుకంటే.. తాను తెలంగాణకు సీఎంగా ఉంటూనే దేశమంతా పర్యటిస్తానని, అందులో ఎవ్వరికీ ఎటువంటి అనుమానం అక్కర్లేదని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. తన టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీ ‘బీఆర్ఎస్’గా ప్రకటించిన తర్వాత ఆయన ఆ స్పష్టతనిచ్చారు. ఉజ్వల భారతం తయారు కావాల్సిన అవసరమున్నదన్న ఆయన.. మన దేశంలో ఉన్న వనరుల్ని వాడితే, అమెరికా కంటే గొప్పగా అభివృద్ధి చెందుతామన్నారు.

ఏపని చేసినా అర్థవంతంగా, ప్రకాశవంతంగా చేయాలన్న కేసీఆర్.. తెలంగాణను సాధించుకున్న అనతికాలంలోనే వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, తాగునీరు వంటి సమస్త రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతున్నామన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో దేశాన్ని ఏలిన పార్టీలు కేవలం గద్దెనెక్కడం, గద్దెదిగడం తప్ప.. దేశానికి చేసిందేమీ లేదని అన్నారు. ఇతర పార్టీలకు రాజకీయాలు ఒక ఆట వంటిది కానీ.. టిఆర్ఎస్‌కి అదొక టాస్క్ అని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పుడు తలసరి ఆదాయం ఒక లక్ష రూపాయలు మాత్రమే ఉండేదని.. కానీ ఇప్పుడు 2 లక్షల 78 వేల రూపాయలకు పెరిగిందన్నారు. అలాగే.. 2014లో జీఎస్డీపీ 5 లక్షల 6 వేలుంటే, నేడు 11 లక్షల 50 వేలకు చేరుకున్నదన్నారు. ఎలాగైతే కష్టపడి తెలంగాణని అభివృద్ధి ప్రగతిలో నడిపించామో.. అలాగే దేశం కోసం కష్టపడి, అభివృద్ధిని సాధించి చూపిద్దామని పిలుపునిచ్చారు.

Also Read

  • IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ
  • Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు హైకోర్టులో ఊరట
  • TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..!
  • Sigachi Victims: సిగాచి ప్రమాదంలో మృ*తుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా..?

జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదని.. అన్నీ బేరీజులు వేసుకొని, బలమైన పునాదుల మీద నుంచే తీసుకున్న నిర్ణయమని కేసీఆర్ అన్నారు. భారత దేశం రాష్ట్రాల సమాఖ్య అని.. రాష్ట్రాలు, దేశం కలిసి అభివృద్ధి చెందితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మన దేశాన్ని లింగ, కుల వివక్షలు పట్టి పీడిస్తున్నాయని.. లింగ వివక్ష వల్ల దేశ జనాభాలోని సగం మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు కాలేకపోతున్నారన్నారు. ఇక కుల వివక్ష కారణంగా.. దేశ జనాభాలో 20 శాతం ఉన్న దళితులు కూడా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోలేకపోతున్నారన్నారు. నేడు దళిత బంధు ప్రత్యేకంగా దళిత జనోద్దరణ కోసం అమలు చేస్తున్న కార్యక్రమమని.. దీని ద్వారా దళితులకు కూడా ఇతరుల్లాగే అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రైతుబంధు పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని అన్నారు.

దేశంలో నిర్లక్ష్యానికి గురైన మరో రంగం వ్యవసాయ రంగమని.. రైతులు తమ హక్కుల సాధన కోసం 13 నెలల పాటు రోడ్ల మీద ధర్నాలు చేసే పరిస్థితి తలెత్తడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజల సమస్యలనే ఎజెండాగా చేసుకుని.. జాతీయ పార్టీ జెండాను పట్టుకుని ముందుకు సాగుతున్నామన్నారు. వనరులు ఉండి కూడా.. వాటిని సద్వినియోగం చేసుకోలేక దేశ ప్రజలు వంచించబడుతున్నారని, ఇది శోచనీయమని అన్నారు. ఈ పద్ధతిని మనమే మార్చాలని.. తెలంగాణను ఎలాగైతే బాగు చేసుకున్నామో, దేశాన్ని కూడా బాగు చేసుకుందామన్నారు. పలు రకాల పంటల్ని పండించి.. ప్రపంచానికి అవసరమైన ఆహార ఉత్పత్తులను అందించాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలతోని నీల్లు ఇచ్చినట్టు.. దేశవ్యాప్తంగా ఇంటింటికి నల్లా అందించాలన్నారు. ఇందుకు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే చాలన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Party Announcement
  • cm kcr
  • kcr new party
  • raithu bandhu
  • telangana schemes

తాజావార్తలు

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..

  • Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!

  • Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్‌.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల

  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?

  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions