CM KCR: గజ్వేల్ బీఆర్ఎస్ నాయకులతో సీఎం కేసీఆర్ భేటీ.. అదే కారణమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సీఎం కేసీఆర్ ఇవాళ భేటీ కానున్నారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటల ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తన నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మేడ్చల్ జిల్లా అంతాయిపల్లి గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఈరోజు సమావేశం జరగనుంది. గజ్వేల్లో నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్లుగా మంత్రి హరీశ్రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలను ముఖ్యమంత్రి ఇప్పటికే నియమించారు. ఈరోజు జరిగే సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితోపాటు ముఖ్య నేతలు పాల్గొంటారని సమాచారం.
ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగించాల్సి ఉండడంతో సొంత నియోజకవర్గంలో ప్రచారం చేయలేక పోతున్నారు. అందుకే ఈ సమావేశానికి ఒక్కో గ్రామం నుంచి సుమారు 20 నుంచి 25 మంది కీలక కార్యకర్తలను పిలిపించి ప్రచార బాధ్యతలపై దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గజ్వేల్లో ఈటల రాజేందర్ పోటీ చేస్తారని ప్రకటించిన నేపథ్యంలో గజ్వేల్కు చెందిన పలువురు నేతలు ఈటెలతో సంప్రదింపులు జరిపినట్లు తెలియడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈటల ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు కావడం, నియోజకవర్గంలో 50 వేలకు పైగా ముదిరాజ్ ఓట్లు ఉండడంతో కేసీఆర్ జాగ్రత్త పడ్డారు. నియోజకవర్గంలో పలువురు ముదిరాజ్ కులస్తులు ఈటెలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరు నేతలు కూడా సమావేశాలు పెట్టి ఎన్నికలకు మద్దతిస్తామని బహిరంగంగానే ప్రకటించారు.
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
ఈ నేప థ్యంలో ముఖ్య మంత్రి ఈ కీల క కార్య క ర్త ల స మావేశం నిర్వ హించ డం ప్రాధాన్యం సంత రించుకుంది. ముఖ్యమంత్రి 2004 వరకు సిద్దిపేట నుంచి పోటీ చేసి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు, ఆ తర్వాత రెండు దఫాలు ఎంపీగా పోటీ చేశారు. ఆయన సిద్దిపేట నియోజకవర్గం నుంచి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి హరీశ్ రావును రంగంలోకి దించారు. 2014లో తెలంగాణకు వచ్చిన తర్వాత గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2018లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి గజ్వేల్తో పాటు ముఖ్యమంత్రి కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు.
Dr. Laxman: మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటు తెలంగాణ లిస్టు ఫైనల్.. క్లారిటీ ఇచ్చిన లక్ష్మణ్
తాజావార్తలు
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!