Fake Passport Scam: రాష్ట్రంలో నకిలీ పాస్ పోర్ట్ స్కాం.. 92 మందికి లుక్ ఔట్ నోటీసులు
Fake Passport Scam: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన నకిలీ పాస్పోర్టు స్కాం కేసు దర్యాప్తును సీఐడీ వేగవంతం చేసింది. నకిలీ పత్రాలు సృష్టించి ఇతర దేశాలకు చెందిన వారికి పాస్పోర్టులు జారీ చేసిన కేసులో మరో ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతపురంకు చెందిన ఏజెంట్తో పాటు మరొకరిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పాస్పోర్టులతో పాటు పలు నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని సీఐడీ అరెస్ట్ చేయగా.. తాజా అరెస్టులతో ఈ సంఖ్య 14కు చేరింది. ఈ కేసులో కీలక నిందితుడు అబ్దుస్ సత్తార్ అల్ జవహరి నిలోఫర్ హాస్పిటల్ పేరుతో విదేశీయుల కోసం నకిలీ ఆధార్, పాన్ కార్డులు, నకిలీ జనన ధృవీకరణ పత్రాలు సృష్టించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే 92 మంది విదేశీయులు నకిలీ పత్రాలతో పాస్పోర్టులు తీసుకున్నట్లు సీఐడీ గుర్తించింది. ఆ దేశాల్లో విదేశీయులు భారతీయ పౌరులుగా చెలామణి అవుతున్నారని పేర్కొంది. జగిత్యాల, ఫలక్నుమా చిరునామాలతో కూడిన పాస్పోర్టులు ఎక్కువగా తీసుకున్నట్లు విచారణలో తేలింది.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
- Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
Read also: Kejriwal: బీజేపీ కుట్ర.. మా ఎమ్మెల్యేలను కొనేందుకే నన్ను అరెస్ట్ చేస్తారటా..?
ఈ క్రమంలో దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసే పనిలో సీఐడీ నిమగ్నమైంది. ఒకే చిరునామాతో ఎక్కువ మంది పాస్పోర్టులు పొందినట్లు సీఐడీ వెల్లడించింది. ఇప్పటికే కొందరు నకిలీ పాస్ పోర్టులతో విదేశాలకు వెళ్లగా.. మిగిలిన వారు దేశం దాటకుండా లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు అరెస్టయిన ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో సీఐడీ అధికారులు 35కి పైగా పాస్పోర్టులను రద్దు చేయాలని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి సమాచారం అందించారు.
మరోవైపు పాస్ పోర్టుల జారీలో కీలకపాత్ర పోషించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులు ఉన్నతాధికారులకు సూచించారు. ప్రక్రియ పూర్తి చేసి పాస్పోర్టు ఇప్పించేందుకు ఏజెంట్లు అధికారులకు లంచాలు ఇచ్చినట్లు సీఐడీ ఆధారాలు సేకరించింది. విజిటింగ్ వీసాలతో థాయ్ లాండ్, కెనడా, మలేషియా, ఇరాక్, దుబాయ్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లినట్లు వెల్లడైంది.
Suryapet Municipality: మున్సిపల్ ఆఫీసుల్లో అవిశ్వాస తీర్మానం… హాజరు కానీ కౌన్సిలర్లు..!
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!