Fake Passport Scam: రాష్ట్రంలో నకిలీ పాస్ పోర్ట్ స్కాం.. 92 మందికి లుక్ ఔట్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Passport Scam: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన నకిలీ పాస్పోర్టు స్కాం కేసు దర్యాప్తును సీఐడీ వేగవంతం చేసింది. నకిలీ పత్రాలు సృష్టించి ఇతర దేశాలకు చెందిన వారికి పాస్పోర్టులు జారీ చేసిన కేసులో మరో ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతపురంకు చెందిన ఏజెంట్తో పాటు మరొకరిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పాస్పోర్టులతో పాటు పలు నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని సీఐడీ అరెస్ట్ చేయగా.. తాజా అరెస్టులతో ఈ సంఖ్య 14కు చేరింది. ఈ కేసులో కీలక నిందితుడు అబ్దుస్ సత్తార్ అల్ జవహరి నిలోఫర్ హాస్పిటల్ పేరుతో విదేశీయుల కోసం నకిలీ ఆధార్, పాన్ కార్డులు, నకిలీ జనన ధృవీకరణ పత్రాలు సృష్టించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే 92 మంది విదేశీయులు నకిలీ పత్రాలతో పాస్పోర్టులు తీసుకున్నట్లు సీఐడీ గుర్తించింది. ఆ దేశాల్లో విదేశీయులు భారతీయ పౌరులుగా చెలామణి అవుతున్నారని పేర్కొంది. జగిత్యాల, ఫలక్నుమా చిరునామాలతో కూడిన పాస్పోర్టులు ఎక్కువగా తీసుకున్నట్లు విచారణలో తేలింది.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
Read also: Kejriwal: బీజేపీ కుట్ర.. మా ఎమ్మెల్యేలను కొనేందుకే నన్ను అరెస్ట్ చేస్తారటా..?
ఈ క్రమంలో దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసే పనిలో సీఐడీ నిమగ్నమైంది. ఒకే చిరునామాతో ఎక్కువ మంది పాస్పోర్టులు పొందినట్లు సీఐడీ వెల్లడించింది. ఇప్పటికే కొందరు నకిలీ పాస్ పోర్టులతో విదేశాలకు వెళ్లగా.. మిగిలిన వారు దేశం దాటకుండా లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు అరెస్టయిన ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో సీఐడీ అధికారులు 35కి పైగా పాస్పోర్టులను రద్దు చేయాలని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి సమాచారం అందించారు.
మరోవైపు పాస్ పోర్టుల జారీలో కీలకపాత్ర పోషించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులు ఉన్నతాధికారులకు సూచించారు. ప్రక్రియ పూర్తి చేసి పాస్పోర్టు ఇప్పించేందుకు ఏజెంట్లు అధికారులకు లంచాలు ఇచ్చినట్లు సీఐడీ ఆధారాలు సేకరించింది. విజిటింగ్ వీసాలతో థాయ్ లాండ్, కెనడా, మలేషియా, ఇరాక్, దుబాయ్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లినట్లు వెల్లడైంది.
Suryapet Municipality: మున్సిపల్ ఆఫీసుల్లో అవిశ్వాస తీర్మానం… హాజరు కానీ కౌన్సిలర్లు..!
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!