CM KCR: నేడే పాలమూరుకు కేసీఆర్.. ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: బీఆర్ఎస్ అధినేత త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పర్యటించనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసిన సీఎం కేసీఆర్. అనివార్య కారణాల వల్ల నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వాయిదా పడింది. ఆ వెంటనే వనపర్తి నియోజకవర్గంలో సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని ఆదేశించారు. కాగా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో గులాబీ దళం వ్యూహాత్మకంగా ప్రచారంలో దూసుకుపోతోంది. అసలు విషయానికి వస్తే సీఎం కేసీఆర్ మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. మిగతా చోట్ల ఎన్నికల ప్రచార సమయాన్ని కూడా ఖరారు చేస్తున్నారు. ప్రచారానికి సమయం దొరుకుతుందో లేదోనని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఎన్నికలకు ఇంకా 35 రోజులు మాత్రమే మిగిలి ఉండగానే కారు టాప్ గేర్ లో దూసుకుపోతోంది. బీఫారం పొందిన అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో గులాబీ బాస్ కేసీఆర్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. జడ్చర్లలో ఎన్నికల శంఖారావం పూరించిన ఎనిమిది రోజుల తర్వాత అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభ జరుగుతోంది. వచ్చే నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా.. మూడు రోజుల తర్వాత వరుసగా మరో మూడు నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైంది. ఉమ్మడి జిల్లాలోని దాదాపు సగం నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నామినేషన్ల పర్వం పూర్తయిన తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లోనూ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి దశలో మరో విడుత ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మూడు విడుతల్లోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ప్రచారం చేసే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్ రావు అన్ని నియోజకవర్గాల్లోని ముఖ్యమైన పట్టణాల్లో కూడా రోడ్ షోలు చేపట్టనున్నారు.
Onion Price: సామాన్యులకు ఉల్లిఘాటు.. తగ్గేనా.. పెరిగేనా?
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!