CPI Narayana: 5 గ్రామాలు తెలంగాణలో కలపడానికి చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపదానికీ అభ్యంతరం లేదని చంద్ర బాబు స్పష్టం చేయాలని సిపిఐ నేత నారాయణ అన్నారు. తెలుగు రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నప్పుడే రెండు రాష్ట్రాలు రాజకీయాలు ప్రక్కన పెట్టి వారిని కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. కాపాడాల్సిన బాధ్యత నుండి తప్పించుకోవటానికే రెండు ప్రభుత్వాలు ఉద్దేశ్యం పూర్వకంగానే ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. మునిగిన ప్రాంతాలు కాపాడుకోవడం విస్మరించి రెండు రాష్ట్రాల మంత్రులు ఉద్దేశ్య పూర్వకంగానే విషయాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ లోకి ఐదు గ్రామాలను కలిపే అంశంపై CPI పార్టీ మద్దతు తెలుపుతుందని అన్నారు. ఇన్వెస్టగేషన్ ఏజన్సీలు మోడీకి అనుకూలంగా వ్యవరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. వరద ముంపు ప్రాంతాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని పేర్కొన్నారు. కేంద్రాన్ని రెండు రాష్ట్రలు జాతీయ విపత్తుగా గుర్తించాలని అడగాలని డిమాండ్ చేసారు. ఐదు గ్రామాలను తెలంగాణలో రావటానికి ఎటువంటి అభ్యతరం లేదని చంద్రబాబు తెలిపాలని సంచలన వ్యాఖ్యలు చేసారు. సీపీఐ నారాయణ.
read also: Madala Ravi Birthday Special : నాన్న బాటలో నడచిన మాదాల రవి!
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
వరద ప్రభావంతో తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన వివిధ గ్రామాల వాసులు తమను తెలంగాణలో కలపాలంటున్నారు. తెలంగాణ సహకారం లేకపోతే మా ప్రాణాలు నట్టేట్లో కలిసి పోయేవని గుండాల వాసులు అంటున్నారు.హైదరాబాద్ నుంచి ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా ,రాజమండ్రి ప్రాంతాలకు వెళ్లే ప్రధానమైన రహదారి పక్కనే గుండాల గ్రామం ఉంది. తెలంగాణ ప్రాంతం తమలో కలపాలని కోరుతున్న ఒక గ్రామంలో ఇది ఒక గ్రామం. అయితే.. కొద్ది రోజులుగా తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని గుండాల, పురుషోత్తపట్నం, యటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాల ప్రజలు జూన్ 24న భారీ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. వైద్య, విద్య, వ్యాపారపరంగా ఏ విధంగా చూసినా గత కొన్ని దశాబ్ధాలుగా ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మంలతో కొనసాగిన అనుబంధమే తమకు అన్ని విధాల అనుకూలంగా ఉందని, రాష్ట్ర విభజనలో తమను ఏపీలో కలపడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విలీన పంచాయతీల ప్రజలు ఆవేదన వక్తం చేస్తున్నారు. తమను తెలంగాణ పరిధిలోని భద్రాచలంతోనే కొనసాగాలని ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీల వాసులు ముక్తకంఠంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!