Mahaboobnagar: మహబూబ్ నగర్ లో చికెన్ గున్యా కేసులు.. భయాందోళనలో ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahaboobnagar: చికెన్ గున్యా కేసులు నగరంలో వేగంగా పెరుగుతున్నాయి. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాల కారణంగా ఈ అంటువ్యాధుల కేసులు ప్రబలుతున్నాయి చికెన్ గున్యా పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ పేర్కొంది. అకాల వర్షాలకు మళ్ళీ చికెన్ గున్యా కోరలు చాచుతుంది. చికెన్ గున్యా వ్యాధితో హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. చికెన్ గున్యా కేసులు ఎక్కువగా మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకోవడం కలకలం రేపుతుంది. విష జ్వరాలతో ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ఆస్పత్రిలో సాధారణం కంటే.. ఎక్కువగా కేసులు నమోదవుతూ.. రోగులు కిక్కిరిసి పోతున్న పరిస్థితి ఆందోలనకు గురి చేస్తుంది. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగుల సంఖ్య 60 వరకు ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. చికెన్ గున్యాతో సంబంధించిన కేసులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో పెరిగిపోతున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది.
Read also: HIV-positive: హెచ్ఐవీ ఉందని తెలిసి కూడా 200 మందితో సంబంధం పెట్టుకున్న మహిళ..
Also Read
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
- Off The Record : సొంత ప్రభుత్వమైనా తగ్గేదే లే.. దొంతి మాధవరెడ్డి రూటే సెపరేటు!
మహబూబ్ నగర్ జిల్లాలో మిడ్జిల్ లో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లో చికెన్ గున్యా బాధితులు ఉండటం భయాందోళనకు గురిచేస్తుంది. చికెన్ గున్యా కేసులు ఎక్కవగా అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలకు ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో పెద్దలక కన్నా చిన్న పిల్లలు చికెన్ గున్యా బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. విపరీతమైన తల నొప్పి, కండరాల నొప్పులు, పెద్ద సంఖ్యలో జ్వరాలు బారిన పడుతున్నారు. ఇంటి ముందు బురదలు దాని వల్ల దోమలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. అకాల వర్షాలతో వాతావరణ మార్పు రావడం జ్వరాలకు మరో కారణం అంటున్నారు వైద్యులు. జ్వరం రావడంతో డోలో ఏదో ఒక మాత్రలు వాడుతున్నారని, ఆ తరువాత నరాల నొప్పులు ఎక్కువ కావడంతో ఆసుపత్రులకు పరుగులు పెట్టే పరిస్థితులు ఎదురవుతున్నాయి. చికెన్ గున్యా బారిన పడుతున్న వారు ఎక్కువగా మిడ్జిల్ ప్రాంత వాసులే కావడం విశేషం. దీంతో వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. వారిని నుంచి శ్యాంపిల్స్ సేకరిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అజాగ్రత్తగా ఉండకూడదని తెలిపారు.
AP Violence: చంద్రగిరిలో హింసాత్మక ఘటనలపై పోలీసులు అలెర్ట్
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?