Fake Call: కృష్ణ ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్.. రైల్లో వున్న వ్యక్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat Phone Call to Krishna Express Rail: బాంబు బెదిరింపు కాల్ హైదరాబాద్ లో తీవ్ర కలకలం సృష్టించింది. కృష్ణా ఎక్స్ప్రెస్ రైలులో బాంబు ఉందన్న ఫేక్ ఫోన్ కాల్ పోలీసులను పరుగులు పెట్టించింది. దీంతో వెంటనే పోలీసులు సికింద్రాబాద్ చేరుకోనున్న కృష్ణ ఎక్స్ప్రెస్ మౌలాలిలో ఆపి తనికీలు నిర్వహించారు. అప్పటికే స్టేషన్లో సిద్ధంగా ఉన్న బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు ప్రారంభించారు. బాంబు బెదిరింపు కాల్ వచ్చిన నేపథ్యంలో అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా పెద్దఎత్తున పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది మోహరించారు. పదో నెంబర్ ఫ్లాట్ ఫారమ్ వద్ద కూడా తనిఖీలు నిర్వహించారు. మౌలాలి వద్ద రైల్ను డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత.. ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చారు. అనంతరం కృష్ణా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ చేరుకుంది. ఈ బాంబు బెదిరింపు కాల్ వల్ల 2 గంటల ఆలస్యంగా కృష్ణా ఎక్స్ప్రెస్ ఆదిలాబాద్ బయలు దేరింది. బాంబ్ లేదని తేలాగా కాల్ చేసిన నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చివరికి రైల్ లోనే ఉన్న కిరణ్ ను అదువులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
Also Read
ఫేక్ కాల్ చేసిన వ్యక్తి కిరణ్ అనే యువకున్ని అదుపులోకి తీసుకొని రైల్వే పోలీసులు ప్రశ్నించగా ఆశక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్సై పరీక్షల్లో ఫెయిల్ అయిన కిరన్ అనే నిరుద్యోగి మానసికంగా కృంగిపోయాడు. డిసెంబర్ మాసంలో ఎస్సై ఈవెంట్స్ లో ఫెయిల్ అయిన నాటి నుంచి కిరణ్ అలాగే ప్రవర్తిస్తున్నాడని, తలకు గాయం కావడంతో మతిస్థిమితం కోల్పోయాడని, మానసిక స్థితి సరిగా లేదని అతని తండ్రి తెలియజేయడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. రైల్లో భువనగిరి నుంచి వస్తూ బాత్రూంలోకి వెళ్లి కృష్ణ ఎక్స్ప్రెస్ లో బాంబు ఉందంటూ 100కు డయల్ చేసి చెప్పాడు. అయితే రైల్లో జనాలు అధికంగా ఉన్నది చూసి వాళ్లంతా టెర్రరిస్టులు గాని భావించి ఫోన్ చేశానని పోలీసులకు తెలియజేశాడు కిరణ్.
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
దేశంలో సెక్యూరిటీ ఏజెన్సీలు, బలగాలు హైఅలెర్ట్ లో ఉన్నాయి. రిపబ్లిక్ డే నాడు ఎలాంటి ఉగ్రవాదుల దాడులు జరగకుండా.. చర్యలు చేపడతున్నాయి. ఇక హైదరాబాద్ లో రిపబ్లిక్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్న సిబ్బందికి ఈఫేక్ ఫోన్ కాల్ తీవ్ర కలకలం రేపింది. రిపబ్లిక్ డే కు ఇక ఐదురోజులే ఉండటంతో.. నగరంలో పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. అయితే.. ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ ఇప్పటికే రెండు మూడు సార్లు వచ్చిన దాఖలాలున్నాయి. నగరంలోని చార్మినార్ దగ్గర బాంబు పెట్టామంటూ కాల్స్ చేసి బెదిరించారు. అయితే ఫోన్ ఆ కాల్స్తో అప్రమత్తమైన సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. చివరికి అది ఆకతాయి ఫోన్కాల్గా తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఆకతాయిల ఫోన్ కాల్ అని అనుమానం వచ్చిన సిబ్బంది వాళ్ల జాగ్రత్తలో వాళ్లు ఉండాల్సిందే.
Andhra Pradesh: సీఎం జగన్ను కలిసిన జోయ్ అలుక్కాస్ అధినేత
తాజావార్తలు
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
-
Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
-
MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!