Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bomb Threat Phone Call To Krishna Express Rail

Fake Call: కృష్ణ ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్‌.. రైల్లో వున్న వ్యక్తే..

Published Date :January 21, 2023 , 7:30 am
By NTV WebDesk
Fake Call: కృష్ణ ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్‌.. రైల్లో వున్న వ్యక్తే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bomb Threat Phone Call to Krishna Express Rail: బాంబు బెదిరింపు కాల్ హైదరాబాద్‌ లో తీవ్ర కలకలం సృష్టించింది. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉందన్న ఫేక్ ఫోన్ కాల్ పోలీసులను పరుగులు పెట్టించింది. దీంతో వెంటనే పోలీసులు సికింద్రాబాద్ చేరుకోనున్న కృష్ణ ఎక్స్ప్రెస్ మౌలాలిలో ఆపి తనికీలు నిర్వహించారు. అప్పటికే స్టేషన్‌లో సిద్ధంగా ఉన్న బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు ప్రారంభించారు. బాంబు బెదిరింపు కాల్‌ వచ్చిన నేపథ్యంలో అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా పెద్దఎత్తున పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది మోహరించారు. పదో నెంబర్ ఫ్లాట్ ఫారమ్ వద్ద కూడా తనిఖీలు నిర్వహించారు. మౌలాలి వద్ద రైల్‌ను డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత.. ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చారు. అనంతరం కృష్ణా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ చేరుకుంది. ఈ బాంబు బెదిరింపు కాల్ వల్ల 2 గంటల ఆలస్యంగా కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఆదిలాబాద్ బయలు దేరింది. బాంబ్ లేదని తేలాగా కాల్ చేసిన నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చివరికి రైల్ లోనే ఉన్న కిరణ్ ను అదువులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Read also: Sri Hanuman Stotra Parayanam Live: నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే కాలసర్ప దోషం, పితృ దోషాలు తొలగిపోతాయి

Also Read

  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
  • Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
  • NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

ఫేక్ కాల్ చేసిన వ్యక్తి కిరణ్‌ అనే యువకున్ని అదుపులోకి తీసుకొని రైల్వే పోలీసులు ప్రశ్నించగా ఆశక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్సై పరీక్షల్లో ఫెయిల్ అయిన కిరన్ అనే నిరుద్యోగి మానసికంగా కృంగిపోయాడు. డిసెంబర్ మాసంలో ఎస్సై ఈవెంట్స్ లో ఫెయిల్ అయిన నాటి నుంచి కిరణ్ అలాగే ప్రవర్తిస్తున్నాడని, తలకు గాయం కావడంతో మతిస్థిమితం కోల్పోయాడని, మానసిక స్థితి సరిగా లేదని అతని తండ్రి తెలియజేయడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. రైల్లో భువనగిరి నుంచి వస్తూ బాత్రూంలోకి వెళ్లి కృష్ణ ఎక్స్ప్రెస్ లో బాంబు ఉందంటూ 100కు డయల్ చేసి చెప్పాడు. అయితే రైల్లో జనాలు అధికంగా ఉన్నది చూసి వాళ్లంతా టెర్రరిస్టులు గాని భావించి ఫోన్ చేశానని పోలీసులకు తెలియజేశాడు కిరణ్.

Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

దేశంలో సెక్యూరిటీ ఏజెన్సీలు, బలగాలు హైఅలెర్ట్‌ లో ఉన్నాయి. రిపబ్లిక్‌ డే నాడు ఎలాంటి ఉగ్రవాదుల దాడులు జరగకుండా.. చర్యలు చేపడతున్నాయి. ఇక హైదరాబాద్ లో రిపబ్లిక్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్న సిబ్బందికి ఈఫేక్ ఫోన్ కాల్ తీవ్ర కలకలం రేపింది. రిపబ్లిక్ డే కు ఇక ఐదురోజులే ఉండటంతో.. నగరంలో పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. అయితే.. ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ ఇప్పటికే రెండు మూడు సార్లు వచ్చిన దాఖలాలున్నాయి. నగరంలోని చార్మినార్ దగ్గర బాంబు పెట్టామంటూ కాల్స్ చేసి బెదిరించారు. అయితే ఫోన్ ఆ కాల్స్‌తో అప్రమత్తమైన సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. చివరికి అది ఆకతాయి ఫోన్‌కాల్‌గా తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఆకతాయిల ఫోన్ కాల్ అని అనుమానం వచ్చిన సిబ్బంది వాళ్ల జాగ్రత్తలో వాళ్లు ఉండాల్సిందే.
Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన జోయ్ అలుక్కాస్ అధినేత

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bomb threat phone call
  • Bomb Threat Phone Call to Krishna Express Rail
  • krishna express rail
  • tirupati to adilabad

తాజావార్తలు

  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు

  • Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..

  • మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!

  • NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..

  • Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions